Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Naveen Mittal: భూసమస్యలకు నూరుశాతం పరిష్కారం

–రాష్ట్రానికి మార్గదర్శకంగా నిలిపేం దుకు పైలెట్ ప్రాజెక్టుగా తిరుమలగి రి సాగర్ మండలాన్ని ఎంపిక చేశాం
–రాష్ట్ర రెవెన్యూ ప్రిన్సిపల్ కార్యద ర్శి, భూ పరిపాలన చీఫ్ కమిషనర్ నవీన్ మిట్టల్

Naveen Mittal:ప్రజా దీవెన, నల్లగొండ: నల్గొండ జిల్లా తిరుమలగిరి సాగర్ (Tirumalagiri Sagar)మం డలంలోని భూ సమస్యలను నూ టికి నూరు శాతం పరిష్కరించి రా ష్ట్రానికి మార్గదర్శకంగా నిలిపేం దుకు తిరుమలగిరి సాగర్ మం డలాన్ని పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేయడం జరిగిందని రాష్ట్ర రెవె న్యూ ప్రిన్సిపల్ కార్యదర్శి, మరియు భూ పరిపాలన చీఫ్ కమిషనర్ నవీన్ మిట్టల్ (Naveen Mittal) అన్నారు. బుధవారం అయన తిరుమలగిరి సాగర్ మం డలం చింతల పాలెం గ్రామంలో భూసమస్యల పరిష్కారం నిమిత్తం రైతులతో ఏర్పాటుచేసిన గ్రామసభ కు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా నవీన్ మిట్టల్ (Naveen Mittal)మాట్లాడుతూ భూములకు సంబం ధించిన సమస్యలన్నిటికీ పరిష్కా రం తీసుకువచ్చేందుకుగాను ప్రభు త్వం కృషి చేస్తున్నదని చెప్పారు. ఇందులో భాగంగా ప్రస్తుతమున్న భూయాజమాన్య హక్కు చట్టంలో (ఆర్ ఓ ఆర్) కొన్ని సాదాబైనామ , విరాసత్ వంటి సమస్యలు తీర్చడా నికి నిబంధనలు లేనందున ఈ సమస్యల పరిష్కారం నిమిత్తమై కొత్త చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరాన్ని ప్రభుత్వం గుర్తించినట్లు తెలిపారు. ఈ క్రమంలో రెవెన్యూ చట్టంలో పారదర్శకత తీసుకువ చ్చేందుకుగాను కొత్త చట్టం తేవాల న్న ఉద్దేశంతో ముసాయిదా చట్టా న్ని రూపొందించడం జరిగిందని తెలిపారు. తిరుమలగిరి సాగర్ మండలాన్ని భూ సమస్యల పరి ష్కారంలో పైలెట్ మండలం గా తీసుకునే విషయమై రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో చర్చించిన అనంతరం రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) రాష్ట్ర శాసనసభలో ప్రకటన చేయడం జరిగిందని ఆయన చెప్పారు.

ప్రస్తుతం ఉన్న చట్టంలో కొన్ని సమస్యలను పరిష్కరించేం దుకు అవకాశం లేదని, వీటిని దృష్టిలో ఉంచుకుని నూతన చట్టం తీసుకురావాలని ప్రతిపాదించి దాన్ని రాష్ట్రవ్యాప్తంగా రైతులు, ప్రజల్లోకి తీసుకువెళ్లి సూచనలు, సలహాలతో తీసుకోవడం జరుగు తున్నదని చెప్పారు. రానున్న నూత న చట్టం తప్పనిసరిగా దీర్ఘకాలం రైతులకు ఉపయోగపడుతుందన్న నమ్మకాన్ని ఆయన వెలిబుచ్చారు. తిరుమలగిరి సాగర్ మండలంలోని భూ సమస్యలను అన్నిటిపై అధ్య యనం చేసి ఒక్కో సమస్యను పరిష్కరిస్తామని ,ముఖ్యంగా ఫారెస్ట్, రెవెన్యూ సంబంధించిన సమస్యలు, అలాగే ఇతర సమ స్యలన్నింటినీ పరిష్కరిస్తామని తెలిపారు. తిరుమలగిరి సాగర్ లోని సమస్యలు అన్నింటిని నూటికి నూరు శాతం పరిష్క రించేందుకు కృషిచేసి ఈ మండ లాన్ని రాష్ట్రానికి మార్గదర్శకం చేసేలా కృషి చేస్తామన్నారు.జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి (C. Narayana Reddy)మాట్లా డుతూ ధరణి, భూమి కి సంబం ధించిన సమస్యలను పరిష్కరించి రైతులకు భూ సమస్యలు లేకుండా చేయాలన్న ఉద్దేశంతో తిరుమలగిరి సాగర్ మండలాన్ని పైలెట్ ప్రాజెక్టు మండలoగా ఎంపిక చేసినట్లు తెలి పారు.

భూ సమస్యల పరి ష్కారం నిమిత్తం పైలెట్ మండలానికి స్పెష ల్ డిప్యూటీ కలెక్టర్ సాయి అధికా రిని ఇన్చార్జిగా నియమించి, ఐదు మండల బృందాలను, 10 మంది సర్వేలను నియమించామని ,గత సోమవారం నుండి సర్వే నిర్వహిం చడం జరుగుతున్నదని తెలిపారు. గ్రామస్థాయిలో ఎలాంటి సమస్యలు ఉన్నాయో ప్రత్యక్షంగా తెలుసుకునే నిమిత్తం రాష్ట్ర రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ చింతలపాలెం గ్రామానికి వచ్చినట్లు ఆయన వెల్లడించారు. మండలంలో మొత్తం 14 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయని, కృష్ణ నది తీర ప్రాంతంలో అటవీ, ప్రభుత్వ,ప ట్టా భూములు, ఉన్నాయని, అయితే ఈ భూములలో కొంతమం దికి పట్టాలు లేకపోవడం, కొంతమం దికి పట్టాలు ఉన్న భూమి లేకపోవ డం వంటి సమస్యలతో ఉన్నారని తెలిపారు. మొత్తం మండలంలో 11246 ఎకరాల విస్తీర్ణంలో భూములు ఉన్నాయని ,ఇందులో 1260 ఎకరాలు అటవీభవములు ఉన్నాయని, 3,931 ఎకరాలు మా త్రం ధరణిలో వచ్చిందని, ఇంకా సుమారు 7 వేల ఎకరాలు ధరణి లోకి రావాల్సిన అవసరం ఉందని అన్నారు వివిధ భూ సమస్యలన్నీ మండలంలోని 7 గ్రామాలలో ఎక్కు వగా ఉన్న దృష్ట్యా దీని ఆధారంగా తిరుమలగిరి సాగర్ మండలాన్ని పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన ట్లు చెప్పారు.

వీటితోపాటు, ఆర్ ఓ ఆర్ లో సైతం సమస్యలు ఉన్నా యని, తిరుమలగిరి సాగర్ మం డలం మారుమూల మండలం కావడం, గిరిజన ప్రజలు ఎక్కువగా ఉండటం వల్ల అవగాహన లేని కారణంగా గతంలో ఆర్ ఓ ఆర్ రికార్డులు అప్డేట్ కాలేదని, పట్టాలు ఇచ్చిన వారికి కూడా రికార్డులో రాకపోవడం జరిగిందని తెలిపారు. మండలంలో ఉన్న రెవెన్యూ, ఫారెస్ట్, వదిలివేసిన భూములు, పట్టా భూములలోని సమస్యలను ఆయన కూలంకషంగా వివరించారు. ప్రత్యేకించి చింతల పాలెం గ్రామంలో సుమారు 6000 ఎకరాలకు పట్టాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని ,అలాగే పట్టాలు ఇచ్చిన 3900 ఎకరాలలో ఉన్న బోగస్ పట్టాలను తొలగించాల్సిన అవసరం ఉందని తెలిపారు. సీసీఎ ల్ కార్యాలయాధికారి లచ్చి రెడ్డి మాట్లాడుతూ గ్రామంలో సమస్య లు తెలుసుకునేందుకు రెవెన్యూ తరఫున తప్పనిసరిగా ఒక ఉద్యో గిని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.భూ సమస్యలకు ఏదో రకంగా పరిష్కారం తెలుసు కు నేందుకు కృషి చేస్తున్నామని, అం దులో భాగంగానే తిరుమలగిరి సాగర్ మండలం చింతలపాలెం గ్రా మానికి వచ్చినట్లు ఆయన వెల్ల డించారు.

ధరణి కమిటీ సభ్యు లు,ప్రముఖ న్యాయవాది భూమి సునీల్ మాట్లాడుతూ భూములకు సంబంధించి ప్రస్తుతం ఉన్న చట్టం లో కొన్ని సమస్యల పరిష్కారానికి మార్గం లేనందున కొత్త చట్టం తీసు కువచ్చే ఆలోచనలో ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు. భూమి ఉం డి కాగితాల్లో లేనివారు, కాగితాలు ఉండి భూమి లేని వారు ఉన్నారని, ఎట్టి పరిస్థితులలో భూమి ఉన్న ప్రతి ఒక్కరికి హక్కు ఉండాల్సిన అవసరాన్ని ప్రభుత్వం గుర్తిం చిం దని ,ఇందులో భాగంగానే పాత చట్టంలో సమస్యల పరిష్కారానికి అవకాశం లేదని గుర్తించి నూతన చట్టంలో వాటిని పొందుపరి చేం దుకు ప్రభుత్వం చర్యలు తీసు కుంటున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడారు. అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్ ,డీఎఫ్ఓ రాజశేఖర్,
భూ సమస్యల పరిష్కారాన్ని నియమించబడిన డిప్యూటీ కలెక్టర్ సుబ్రమణ్యం, , ఆర్డీవో శ్రీనివా సరావు, సర్వే ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివా స్, హరి,శ్రీనివాస శర్మ,దశరథ్ నాయ క్,తిరుమలగిరి డి టి ఖాద ర్ , జంగాల కృష్ణయ్య,జవహర్ లాల్, ఆయా మండలాల బృందాల సిబ్బంది, తదితరులు ఉన్నారు.