Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Neetu singh : నేషనల్ యూత్ ఫెస్టివల్కు నీతూసింగ్ ఎంపిక

Neetu singh : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: నల్లగొండ పట్టణoలోని పానగల్ కు చెందిన నీతూసింగ్ నేషనల్ యూ త్ ఫెస్టివల్ కు ఎంపికయ్యారు.న్యూ ఢిల్లీలో ఈనెల 11, 12 తేదీల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యఅతిథిగా హాజరయ్యే నేషనల్ యూత్ ఫెస్టివల్ కు ఈమె ఎంపిక కావడం గమనార్హం. ఈ కార్యక్రమానికి దేశ వ్యాప్తంగా ఎంపి క చేసిన యువ తీయువకులతో పాటు స్పెషల్ అతిథి యూత్ ఐకాన్ నీతూసింగ్ హాజరు కా నున్నట్లు ఏబీవీపీ నాయకులు తెలిపారు.

ప్రస్తుతం నీతూ సింగ్ చాకలి ఐలమ్మ యూనివర్సిటీలో పీజీ ద్వితీయ సంవత్సరం చదు వుతోంది. ఈ సందర్బంగా నీతూ సింగ్ మాట్లాడుతూ తనకు అవ కాశం కల్పించిన ఏబీవీపీ రాష్ట్ర నాయకులకు కృతజ్ఞతలు తెలి పారు.