Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Nukala Narasimha Reddy: వాజ్ పేయ్ జీవితం భావితరాలకు స్ఫూర్తిదాయకం : నూకల నరసింహారెడ్డి

*బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు*..

ప్రజా దీవెన, నల్గొండ టౌన్: మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారి వాజ్ పేయి 100వ జయంతి సందర్భంగా బిజెపి జిల్లా కార్యాలయంలో వారి యొక్క చిత్రపటానికి బిజెపి నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో *బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నూకల నరసింహ రెడ్డి మాట్లాడుతూ.*.

ప్రపంచం మెచ్చిన నాయకుడు అటల్ బిహారీ వాజ్ పేయి అని , వారి జీవితం భావితరాలకు స్ఫూర్తిదాయకమని నూకల నరసింహారెడ్డి కొనియాడారు.వాజ్ పాయ్ ఎంతోమందికి ప్రేరణను ఇస్తూ, ఒక రాజనీతి కోవిదుడు సమున్నత స్థానంలో నిలిచారని అన్నారు..
హైదరాబాదులో వాజ్పేయి బహిరంగ సభలు జరుగుతున్నయని తెలిసిన వెంటనే అనేకమంది స్వచ్ఛందంగా తరలి వెళ్లే వారని,ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా ఒక గంట ముందుగానే కార్యాలయాలకు సెలవు పెట్టి వారి సభలో పాల్గొనేవారు అని తెలిపారు.వాజ్పేయి ప్రసంగాలు సునిశితమైన హాస్యం, చమత్కారాలతో అందరిని మంత్రముగ్ధుల్ని చేసేవారని తెలిపారు.తన జీవితాన్ని భరతమాత సేవకు అంకితం చేసిన గొప్ప నాయకుడు అని కొనియాడుతూ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వాజ్పేయి గారి స్ఫూర్తితో ముందుకు సాగాలని నూకల నరసింహారెడ్డి కోరారు.

అదేవిధంగా రాష్ట్ర పార్టీ పిలుపుమేరకు వాజ్పేయి శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా బిజెపి ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు.భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యదర్శి మాధగాని శ్రీనివాస్ గౌడ్, బిజెపి కిసాన్ మోర్చా జాతీయ నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి, బిజెపి పార్లమెంట్ కన్వీనర్ బండారు ప్రసాద్ ,కో కన్వీనర్ పిల్లి రామరాజు, బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి పాలకూరి రవి గౌడ్, పట్టణ కన్వీనర్ మిర్యాల వెంకటేశం, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు గడ్డం వెంకట్ రెడ్డి, ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ఏడుకొండల హరి, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు రావెళ్ల కాశమ్మ, మహిళా మోర్చా పట్టణ అధ్యక్షురాలు గుగులోతు తార,బిజెపి జిల్లా నాయకులు కంచర్ల విద్యాసాగర్ రెడ్డి, పట్టణ నాయకులు వివిధ మోర్చాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.