Paladugu Nagarjuna: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: రాష్ట్రంలో దళితుల సమగ్ర అభి వృద్ధికై సమగ్ర సర్వేలు (Comprehensive surveys for comprehensive development)నిర్వహించి 26 సంవత్సరాల క్రితం దళితుల సమస్యలను రాష్ట్ర అసెంబ్లీలో చర్చ జరిపించిన ఘనత కులవి వక్ష వ్యతిరేక పోరాట సంఘం దేనని కెవిపిఎస్ రాష్ట్ర ఉపా ధ్యక్షుడు పాలడుగు నాగార్జున (Paladugu Nagarjuna)అన్నారు. బుధవారం నల్లగొండ జిల్లా కేంద్రంలో కెవిపిఎస్ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా స్థానిక సుభాష్ విగ్రహం వద్ద గల జెండాను ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా పాలడుగు నాగార్జున (Paladugu Nagarjuna) మాట్లాడుతూ వేలాది గ్రామాలలో సర్వేలు నిర్వహించి 28 రకాల వివక్షత రూపాలను రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉంచిందని తెలిపారు. రెండు గ్లాసుల విధానము, దేవాలయ ప్రవేశం లేకపోవడం , కులాంతర వివాహాలు చేసుకున్న వ్యక్తులపై దాడి (attack) చేసి హత్యలు గావించడం, కులం పేరుతో దూషించడం స్మశాన వాటిక స్థలాలను ఆక్రమించుకొని అడిగిన వారిపై దౌర్జన్యాలు చేయడం, రోడ్లపై బజార్లలో ఊరేగింపులు చేయనీయకపోవడం, సమాన హోదా దళితులకు ఇవ్వకపోవడం, లాంటి అనేక వివక్షత రూపాలు బయటపడ్డాయని తెలిపారు.
జస్టిస్ పున్నయ్య కమిషన్ ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలో పర్యటనలు నిర్వహించి ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్(SC ST Sub Plan) చట్టాన్ని తీసుకొచ్చిందని తెలిపారు. ఎస్సీ ఎస్టీ చట్టం ద్వారా నిధులు ఖర్చు చేయడానికి ప్రభుత్వాలకు కనీసం విజ్ఞత లేదని సప్లాన్ నిధులు పక్కదారి మళ్లించి దళిత ఇతర ప్రజలకు ప్రభుత్వ రోడ్లు భవనాలు నిర్మించుకోవడానికి ఉపయోగించుకోవటం ఏమిటని ప్రశ్నించారు. ఎన్నికలలో దళితులకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ దళిత బంధు, ఇందిరమ్మ ఇల్లు, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అందాల్సిన నిధుల ఊసే లేదని తెలిపారు. గత బకాయిలు మూడేళ్లుగా పేరుకుపోయాయని విడుదలకు నోచుకోలేదని అన్నారు. కనీసం రాష్ట్రంలో ఎస్సీ సంక్షేమ మంత్రి (SC Welfare Minister)లేకపోవడం దళితులను అవమానించడమేనని దళితుల అభివృద్ధికి అడ్డుపడటమేనని తెలిపారు. వెంటనే ఎస్సీ వెల్ఫేర్ మినిస్టర్ను కేటాయింపు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా దళితుల సమస్యలపై ప్రత్యేకంగా కార్యక్రమాల రూపొందించి ఉద్యమ పోరాటాలు నిర్వహిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా సహాయ కార్యదర్శి గోదె నరసింహ, బొల్లు రవీందర్ ఉపాధ్యక్షులు వంటిపాట కృష్ణ నాయకులు సైదులు రమేషు పోలే సత్యనారాయణ మురళి రఘువరన్ తదితరులు పాల్గొన్నారు.