Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Paladugu Nagarjuna: ఇందిరమ్మ కమిటీలలో అందరికీ అవకాశం కల్పించాలి

Paladugu Nagarjuna: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: రాష్ట్ర ప్రభుత్వం వేసే ఇందిరమ్మ కమిటీలలో అందరికీ అవకాశం కల్పించాలని సిపిఎం జిల్లా కార్య దర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున (Paladugu Nagarjuna) డిమాండ్ చేశారు. శనివారం నల్గొండ మండలం దొనకల్లు గ్రామంలో సిపిఎం గ్రామ శాఖ సమావేశం మంగ దొడ్ల యాద య్య అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా పాలడుగు నాగార్జున మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల (Indiramma’s house) కమిటీలలో ఒకే పార్టీ వారి కాకుండా అన్ని పార్టీల వారికి అన్ని కులాల వారికి ప్రాధాన్యత కల్పించి కమిటీలలో నియమించాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.రేషన్ కార్డులు ధరణి సమస్యలు (Dharani problems) భూముల సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరారు.

మండలంలో అనేక గ్రామాలలో రోడ్లు దెబ్బతిని నడవడానికి వీలు లేని పరిస్థితులలో ఉన్నాయని రోడ్ల మరమ్మతులకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. దొనకల్లు గ్రామంలో వ్యవసాయ రైతులకు (farmers) పోయే దారి లేక ఇబ్బం దులు పడుతున్నారని ఆ దారిని వెంటనే చేయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి నలపరాజు సైదులు మండల కమిటీ సభ్యులు మంగ ధుల యాదయ్య నాయకులు మంగాదుర్ల కృష్ణయ్య, వెంకన్న, కొత్తపల్లి కృష్ణయ్య ,నాగరాజు, సాంబయ్య, బంగారయ్య తది తరులు పాల్గొన్నారు.