Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Paladugu Nagarjuna: ఆత్మగౌరవ కోసం నడిచిన తెలంగాణ సాయుధ పోరాటం

Paladugu Nagarjuna: ప్రజా దీవెన, నల్లగొండ: ప్రపంచ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖిం చబడిన తెలంగాణ రైతాంగ సాయుధ (Telangana Farmers Armed) పోరాటం దున్నేవాడికి భూమి కావాలని వెట్టి చాకిరి నుండి ప్రజలు విముక్తి చేయాలని సాగిన పోరాటంలో నాలుగువేల మంది అమరులు ప్రాణ త్యాగం చేశారని 10 లక్షల ఎకరాల భూ పంపిణీ జరిగిందని పదివేల గ్రామాల్లో గ్రామ స్వరాజ్యాలు నెలకొల్పాయని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున (Paladugu Nagarjuna) అన్నారు. ఈరోజు నల్లగొండ జిల్లా కేంద్రంలోని పెద్ద గడియారం సెంటర్లో అమరవీరుల స్తూపం వద్ద కొవ్వొత్తులతో ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా పాలడుగు నాగార్జున మాట్లాడుతూ నైజాం చివరి రాజు మీరు ఉస్మాన్ అలీ ఖాన్ (Usman Ali Khan) కాసిం రజ్వీ విష్ణురు రామచంద్రారెడ్డి లాంటి ఎందరో ప్రజలను శిస్తుల పేరా పన్నుల పేరా దోపిడీ చేశారని అన్నారు. గ్రామాల్లో సమస్త ప్రజలు వారికి పెట్టి చేయాల్సిందేనని తెలిపారు.

అనేక రకాలుగా ప్రజలను హింసించారని తెలిపారు. మహిళలను చెర పట్టడం చంపడం ఉన్న సొమ్ము సొత్తు దోపిడీ చేయడం లాంటి దుర్మార్గాలకు పాల్పడిన ఘటనలు అనేకo ఉన్నాయని అన్నారు. ఐలమ్మ పంటను అక్రమంగా తరలిస్తుంటే అడ్డుకొని తిరగబడిన పరిస్థితులు ఆ రోజు సంభవించాయని అన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ (Telangana Farmers Armed)పోరాటంలో తొలి అమరవీరుడు దొడ్డి కొమరయ్య బలిదానం వృధా కాదని ప్రజలు పెద్ద ఎత్తున పోరాటాల్లోకి వచ్చి తమ హక్కులను సాధించుకోవాలని పిలుపునిచ్చారు.

పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు తప్ప ఎవరి దయాదాక్షిణ్యల మీద హక్కులు రావు పోరాడితేనే సాధ్యమవుతాయని తెలిపారు. నేడు అనేకమంది తెలంగాణ సాయుధ పోరాటాన్ని వక్రీకరిస్తూ ప్రజలను (peaples) తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. నికరమైన కమ్యూనిస్టుల పోరాటం ద్వారానే ప్రజలు విముక్తి జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గా సభ్యురాలు పాలడుగు ప్రభావతి జిల్లా కమిటీ సభ్యురాలు కొండ అనురాధ సిపిఎం మండల కార్యదర్శి నలుపు రాజు సైదులు తిప్పర్తి మండల కార్యదర్శి మన్యం బిక్షం మండల కమిటీ సభ్యులు కొండ వెంకన్న నలుపరాజు సైదులు, పోలే సత్యనారాయణ పోలే సత్యనారాయణ, బొల్లు రవీందర్ కుమార్ నాయకులు ముక్కామల యాదయ్య శోభన్ బాబు నరసింహ శివ యాదగిరి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.