–బీజేపీ నాయకులు పాలకూరి రవిగౌడ్
Palakuri Ravi Gaud: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: నల్లగొండ నియోజకవర్గ రైతులు ఓట్లువేసి పలుమార్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని (Komati Reddy Venkat Reddy)గెలిపిస్తే ఆ రైతులకే తీరని అన్యాయం చేస్తున్నారని బీజేపి ఓబీసీ మోర్చ రాష్ట్ర అధికార ప్రతినిధి పాలకూరి రవి గౌడ్ (Palakuri Ravi Gaud)ఆవేదన వ్యక్తం చేశారు.నల్గొండ నియోజక వర్గ పరిధిలోని తిప్పర్తి,నల్గొండ , మాడుగుల పల్లి మండలాలలోని పలు గ్రామాలకు ఉదయ సముద్రం రిజర్వాయర్ ద్వారా సాగునీరు అందించే D 39 ,40 కాలువలను ఎండగట్టి, నకిరేకల్ నియోజకవర్గ పరిధిలో ఉన్న సొంత గ్రామమైన బ్రాహ్మ ణవెళ్లాంలకు లిఫ్ట్ ద్వారా సాగు నీటిని తరలించుకపోవడంతో తనను గెలిపించిన రైతుల పొలా లకు సరిపడ నీళ్ళు అందక రైతులు కన్నీరు మున్నీరు అవుతు..
తమ ఆవేదనని తెలియపరుస్తున్నారని రవిగౌడ్ తెలిపారు.కృష్ణా నది పరి వాహక రిజర్వాయర్లు శ్రీశైలం, నాగార్జునసాగర్ ,అదేవిధంగా ఉదయ సముద్రం రిజర్వాయర్లో (Srisailam, Nagarjunasagar, likewise Udaya Samudra Reserve) నిండుగా నీళ్ళు ఉన్నప్పటికీ ఢీ 39 ,D40 కాలువలకు నీళ్లు వదలక పోవడం దారుణమైన విషయమని తెలిపారు.కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఈ యొక్క విషయం పైన స్పందించి నీటిని విడుదల చేసే విధంగా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ రైతులని ఆదుకోవాలని రవిగౌడ్ ( Ravi Gaud))తెలిపారు..