ప్రజా దీవెన ,నల్గొండ: మీడియా ప్రతినిధులపై సినీ నటుడు మోహన్ బాబు దాడి చేయడాన్ని బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి పాలకూరి రవి గౌడ్ తీవ్రంగా ఖండించారు.రవి గౌడ్ మాట్లాడుతూ* ప్రజలకు, ప్రభుత్వాలకు మధ్య వారధిగా ఉన్న మీడియాకు జవాబుదారిగా ఉండాల్సిన వ్యక్తులు అసహనంతో బౌతిక దాడులకు పాల్పడడం సరైంది కాదని పేర్కొన్నారు.
సమాజానికి వాస్తవాలు చెప్పడం కోసం పాత్రికేయులు వృత్తి నిబద్దతతో పనిచేస్తారని, అలాంటి మీడియా ప్రతినిధుల పై దాడి చేసిన మోహన్ బాబు మీడియాకు బహిరంగ క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. మీడియా ప్రతినిధుల పై దాడి చేసిన మోహన్ బాబు పై కేసు నమోదు చేయాలని కోరారు. భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు చర్యలు తీసుకోవాలని రవి గౌడ్ కోరారు..