Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Palla Devender Reddy: మంత్రి హామీతో సివిల్‌ సప్లయీస్‌ హమాలీల సమ్మె విరమణ: పల్లా దేవేందర్ రెడ్డి

Palla Devender Reddy: ప్రజాదీవెన, నల్గొండ టౌన్న: లగొండ సివిల్ సప్లై గోదాము వద్ద ఉదయం నుంచి తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. సివిల్ సప్లై డిఎం ఆర్డిఓ పోలీసులతో ఉదయం నుంచి ఎలాగైనా రేషన్ సరఫరా చేయించాలని తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చారు బయటి కార్మికుల ద్వారానైనా పని జరగాలని ప్రయత్నించారు. ఏఐటీయూసీ నాయకత్వం హమాలి కార్మికులు తీవ్రంగా ప్రతిగటించడం జరిగింది.తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సివిల్‌ సప్లయీస్‌ మరియు జిసిసి హమాలీ కార్మికుల ఎగుమతి, దిగుమతి హమాలీ రేట్ల ఒప్పందం అమలు చేస్తూ వెంటనే జి.ఓ. విడుదల చేయాలని, జనవరి 1 నుండి ఈ రోజు వరకు 7 రోజులు జరిగిన రాష్ట్ర వ్యాపితంగా సమ్మెను కొనసాగిస్తుండగా ఈ రోజు ఎర్రమంజిలోని జలసౌధ ఇరిగేషన్‌ శాఖ రాష్ట్ర కార్యాలయంలో పౌరసరఫరాల శాఖామాత్యులు ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడవెంకట్‌ రెడ్డి ఆధ్వర్యంలో యూనియన్ నాయకులతో కూడిన ప్రతినిధి బృందంతో జరిగిన సమావేశంలో అక్టోబర్‌ 4న జరిగిన వేతన ఒప్పందం ప్రకారం హమాలీ రేట్లను వెంటనే పెంచి అమలు చేయాలని చాడ వెంకట్‌ రెడ్డి మంత్రి కి వివరించగా మంత్రి సానుకూలంగా స్పందిస్తూ 2 రోజుల్లో జి.ఓ.ను విడుదల చేస్తామని దానికి అనుగుణంగా సమ్మెను విరమించాలని కోరినారు.

అక్టోబర్‌ 4న జరిగిన ఒప్పందంలో భాగంగా పెరిగిన హమాలీ రేట్ల బకాయిలను చెల్లించాలని కోరగా చెల్లిస్తామని అదే విధంగా స్వీపర్లకు, హమాలీలకు యూనిఫాం కుట్టుకూలితో సహా చెల్లిస్తామని, బోనస్‌ను రూ.7500లు చెల్లించేందుకు నిర్ణయం తీసుకున్నామని, దసరా పండుగ సందర్భంగా ఇచ్చే స్వీటు బాక్సు రూ.900లకు పెంచిన అగ్రిమెంట్‌ ప్రకారం ఇస్తామని హమాలీలు ఆందోళన చెందొద్దని మంత్రి విజ్ఞప్తి మేరకు నేటి నుండి సమ్మె విరమిస్తున్నట్లు తెలిపారు.

కార్మిక సంఘాల నాయకులుగా గత 7 రోజులుగా ఐక్యంగా సమ్మెలో పాల్గొని సమ్మెను విజయవంతం చేసిన సివిల్‌ హమాలీ సోదరులకు మరియు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.* ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు కె ఎస్ రెడ్డి గీత పని వాళ్ళ సంఘం జిల్లా కార్యదర్శి జిల్లా ప్రధాన కార్యదర్శి బి వెంకటేశ్వర్లు, జానయ్య, బుచ్చయ్య, చంటి, నాగరాజు, లింగయ్య, లింగస్వామి, యాదయ్య, గిరి, జానీ, రామస్వామి, రాంబాబు, శివ తదితరులు పాల్గొన్నారు.