–ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి
PHC: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్ : నల్లగొండ జిల్లాలో మెరుగైన వైద్య సేవలు అందించడానికి ప్రైమరీ హెల్త్ సెంటర్స్ (Primary Health Centres) ఏరియా ఆసుపత్రు లను బలోపేతం చేసి డాక్టర్లు నర్సులు సిబ్బంది కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి (Paladugu Prabhavati)డిమాండ్ (DEMAND) చేశారు. ఈరోజు ఐద్వ ఆధ్వర్యంలో నల్లగొండ మండలం, రాములబండ పిహెచ్సిలో తిప్పర్తి మండల కేంద్రం పిహెచ్సిలో సర్వే నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ పిహెచ్ఈఎల్ (PHCL) లో మందుల కొరత ఉందని అవసరమైన మందులు సరఫరా చేయాలని అన్నారు. కనీస సౌకర్యాలు కూడా లేవని నిధులు కేటాయించి అవసరమైన సౌకర్యాలు కల్పించాలని కోరారు. పీహెచ్సీలలో నెట్ సౌకర్యం లేకపోవడం వలన డాటా ఎంట్రీ (DATA ENTRY) చేసే పరిస్థితి లేదన్నారు. కనీసం మంచినీళ్లు కూడా లేవని అన్నారు. ఐ డ్రాప్స్ కూడా సరఫరా లేవని తెలియజేశారు. ఈ సమస్యలపై త్వరలో జిల్లా వ్యాప్తంగా సర్వేలు నిర్వహించి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించనున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఐద్వ రాష్ట్ర కమిటీ సభ్యురాలు కొండ అనురాధ, బొల్లోజు భారతమ్మ, మనమ్మ సుభద్ర లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.