–పది మందిని సురక్షితంగా కాపా డిన పోలీసులు
–రెస్క్యూ చేసి కాపాడిన నల్లగొండ పోలీసులు
–డిండి వాగు వరదతో వేటకు వెళ్లి అక్కడే చిక్కుకున్న వైనం
–సమాచారం అందుకున్న నల్లగొం డ ఎస్పీ శరత్ చంద్ర పవార్
–వెంటనే డ్రోన్ సాయంతో బాధి తులున్న ప్రదేశం గుర్తింపు
–రంగంలోకి దిగిన పోలీసురెస్క్యూ టీమ్
–తెలంగాణ డీజీపీ జితేందర్ తో పాటు వెల్లివెత్తిన అభినందనలు
Police rescue teams: ప్రజా దీవెన, హైదరాబాద్: నల్లగొండ జిల్లా శివారు డిండి వాగు లో చిక్కుకున్న చెంచులు సురక్షి తంగా ప్రాణాలతో బయటపడ్డారు. వాగులో చిక్కుకున్న పది మందిని పోలీసు రెస్క్యూ బృందాలు (Police rescue teams) రక్షిం చాయి. గోనబోయినపల్లికి చెందిన చెంచులు ఆగస్టు 31వ తేదీన చేప ల వేటకు వెళ్లారు. ఈ క్రమంలో అచ్చంపేట మండలం సిద్ధాపూర్ వద్ద డిండి వాగులో వారు చిక్కు కుపోయారు.
తాము వాగులో చిక్కుకుపోయినట్లు గ్రామస్తులకు సోమ వారం సమాచారం అందిం చగా తద్వారా నల్లగొండ ఎస్పీ శర త్చంద్ర పవార్ (SP Sharachandra Pawar) అప్రమత్తమై ఆదే శాలు జారీ చేయడంతో జిల్లా పోలీ సులు రంగంలోకి దిగారు. డ్రోన్ కెమెరాల సహాయంతో వారున్న ప్రదేశాన్ని గుర్తించారు.వరద నీటిలో చిక్కుకుపోయిన బాధితులకు తొలుత ఆహార పదార్థాలను అం దించారు. అయితే వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో రెస్క్యూ ఆపరేషన్ను (Rescue operation) నిలిపివేశారు.
మంగ ళవారం ఉదయం నాగర్కర్నూల్ పోలీసుల సహాయంతో వారిని క్షేమంగా బయటకు తీసుకొచ్చారు. సహాయక చర్యల్లో పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది, (Police, firemen,)గజ ఈత గాళ్లు పాల్గొన్నారు. కాగా, చెంచు లను రక్షించిన పోలీసులను డీజీపీ జితేందర్ తో పలువురి అభినందన లు వెల్లువెత్తాయి.