Powerloom workers: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: ఇండ్లు లేని నిరుపేద పవర్లూమ్ కార్మికు లకు 120 గజాల స్థలం ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షలు కేంద్ర ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలు ఇంటి నిర్మాణానికి ఇవ్వాలని సిపిఎం (CPM)పట్టణ కార్య దర్శి ఎండి సలీం డిమాండ్ చేశారు. మంగళవారం నల్గొండ పట్టణంలోని 17,35 వార్డుల సీపీఎం శాఖ మహాసభ పద్మనగర్ లో జరిగింది. ఈ సందర్భంగా సలీం మాట్లాడుతూ జీవనోపాధి కోసం వివిధ ప్రాంతాల నుండి పట్టణానికి వలస వచ్చి అద్దె ఇండ్లలో నివాసం ఉంటూ పవర్లూమ్ కార్మికులుగా జీవనోల పొందుతున్న వీరికి ఇండ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కుటుంబంలో ఒక మనిషి మరణిస్తే ఎక్కడ ఉంచి దహన సంస్కారాలు చేయాలో అర్థం కాని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారని అన్నారు.
పవర్లూమ్ పరిశ్రమ సంక్షోభంలో చిక్కుకొని నేసిన వస్త్రాలు అమ్ముడుపోక సరైన కూలీ గిట్టుబాటు (Availability of wages)గాక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న పవర్ రూమ్ కార్మికులకు అద్దె ఇల్లు భారంగా మారాయని అన్నారు. ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలు అందడం లేదని అన్నారు. అర్హత కలిగిన వారందరికీ ఇండ్లు ఇండ్ల స్థలాలు, పెన్షన్లు, రేషన్ కార్డులు, అంత్యోదయ కార్డులు (House plots, pensions, ration cards, antyodaya cards)ఇవ్వాలని డిమాండ్ చేశారు.సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు దండెంపల్లి సత్తయ్య పాల్గొని ప్రసంగించారు. అనంతరం సీపీఎం శాఖ కార్యదర్శి గా గంజి నాగరాజు, సహాయ కార్యదర్శి ఎస్ కె జానీ లని ఏకగ్రీవంగా ఎన్నుకు న్నారు. సీనియర్ సభ్యులు పెండెం రాములు అధ్యక్షతన జరిగిన మహాసభలో శాఖ సభ్యులు మేడిపల్లి సత్తయ్య పోట్టబత్తుల దశరథ , పెండెం బుచ్చి రాములు, దేవులపల్లి గిరిబాబు, దొమ్మటి యాదగిరి, బిమనపల్లి వీరయ్య , నిమ్మనగోటి సైదులు తదితరులు పాల్గొన్నారు