–జడ్పి సిఈఓ ప్రేమ్ కరణ్ రెడ్డి.
Prem Karan Reddy:శాలిగౌరారం సెప్టెంబర్: విద్యార్థులు లక్ష్య సాధన కోసం పట్టుదల, క్రమ శిక్షణ తో కష్టపడి చదివి పాఠశాల కు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుక రావాలని నల్గొండ జిల్లా పరిషత్ సిఈఓ ప్రేమ్ కరుణ్ రెడ్డి (Prem Karan Reddy)అన్నారు.మండలం లోని వల్లాల మోడల్ స్కూల్ (Model School)లో పల్ రెడ్డి ఫౌండేషన్ బాధ్యులు పల్ రెడ్డి రాంరెడ్డి విద్యార్థులకు ఎన్.ఎమ్. ఎమ్ ఎస్ కు సంబంధించి మెటీ రియల్ ను ఉచితంగా అందజే శారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా పరిషత్ సి.ఈ.వో గారు ప్రేమ్కరణ్ రెడ్డి మాట్లాడుతూ పల్ రెడ్డి ఫౌండేషన్ (Pal Reddy Foundation) ద్వారా ఉచితంగా ఇచ్చిన ఈ మెటీరియల్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకుని ఎన్.ఎమ్.ఎమ్.ఎస్ పరీక్షలో మంచి ర్యాంకులు తెచ్చుకోవా లన్నారు.ఉపాధ్యాయులను తల్లి దండ్రులను విద్యార్థులు గౌరవిం చాలని చెడు అలవాట్లకు బానిస లు కావొద్దని సూచించారు.
నల్గొండ డివిజన్ విద్యుత్ శాఖ (Division Electricity Department)డి.ఈ వెంక టేశ్వర్లు మాట్లాడుతూ మోడల్ స్కూల్ విద్యార్థలందరికి యూని ఫామ్, షూస్ తాను ఉచితంగా అందజేస్తానని తెలిపారువిద్యలో పోటీ తత్వం ప్రతి విద్యార్ధి పెంపో దించుకోవాలన్నారు .మెటీరియల్ దాత పల్ రెడ్డి రాంరెడ్డి మాట్లా డుతూ పేద, మధ్య తరగతి విద్యార్థులు పోటీ పరీక్షల్లో (In competitive exams) ప్రతిభ చూపడానికి తాము ఉచితంగా మెటీరియల్ ను మూడు జిల్లాలో అందజేస్తున్నామన్నారు.పాఠశాల ప్రిన్సిపాల్ కే.సంధ్యారాణి మాట్లా డుతూ పిల్లలకు ఉచితంగా పుస్త కాలందజేసిన రాంరెడ్డి వితరణ గొప్పదన్నారు. ఈ సందర్బంగా రాంరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎంపిడీవో, గార్ల పాటి జ్యోతిలక్ష్మి ,శాలిగౌరారం విద్యుత్ ఏఈ శ్రీధర్,ఉపాధ్యా యులు చిత్తలూరి సత్యనారాయ ణ, క్రష్ణమోహన్, సంపత్ కుమార్, క్రిష్ణయ్య,కుక్కడపు శ్రీనివాస్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.