Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Purnachandra: వైద్యుల నిర్లక్ష్యం… ఉన్నచోటనే గర్భిణీ ప్రసవం

–సిబ్బంది నిర్లక్ష్యo పై కుటుంబ సభ్యుల ఆందోళన
–నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రిలో బాధాకర సoఘటన
–జిల్లా కలెక్టర్ ఆదేశంతో అదనపు కలెక్టర్ విచారణ
–దేవరకొండ డ్యూటీ వైద్యురాలు, నలుగురు నర్సులపై సస్పెన్సన్
–నల్లగొండ డ్యూటీ డాక్టర్ సహా నర్సులకు షోకాజ్ నోటీసులు

Purnachandra: ప్రజా దీవెన, నల్లగొండ, ప్రభన్యూస్ ప్రతినిధి: పురిటినొప్పులు పడుతూ ఆస్పత్రికి (hospital)వచ్చిన మహిళకు చికిత్స అందించే విషయంలో వైద్యుల నిర్ల క్ష్యం కారణంగా గర్భిణి ఆపసో పాలు పడుతూ ఉన్న చోటనే వీల్చైర్ లోనే శిశువును ప్రసవించిన సంఘటన నల్లగొండ జిల్లా కేంద్ర ఆస్పత్రిలో జరిగింది. వైద్యుల నిర్ల క్ష్యాన్ని నిరసిస్తూ గర్భిణి బంధు వులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు.విషయం తెలుసుకున్న కలెక్టర్ విచారణకు ఆదేశించారు. పురిటి నొప్పులతో ఆస్పత్రికి వచ్చిన మహిళను (woman)ఆస్పత్రిలో చేర్చుకునేం దుకు సిబ్బంది నిరాకరించడంతో వీల్బైర్లో కూర్చున్న మహిళ తీవ్ర రక్తస్రావమై వీల్బైర్లోనే పండంటి ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ఈ సంఘ టనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నల్లగొండ జిల్లా నేరేడుగొ మ్ముకు చెందిన ఆంజనే యులు, అశ్విని దంపతులకు ఇప్పటికే ఇద్దరు సంతానం కాగా మూడో కాన్పు కోసం గురువా రం దేవరకొండ ప్రభుత్వా స్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ అశ్వినిని పరీక్షించిన వైద్యులు కాన్పు కష్టంగా ఉందని చెప్పి మెరుగైన చికిత్స (Better treatment) కోసం నల్లగొం డ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించ మనిచెప్పారు. దీంతో భర్త ఆంజ నేయులు అశ్వినిని కాన్సు కోసం శుక్రవారం తెల్లవారు జామున నల్లగొండ ఆస్పత్రికి తీసుకెళ్లారు.

అప్పటికే తీవ్రమైన పురిటినొప్పుల తో బాధపడుతున్న అశ్వినిని (ashwini) ఆస్ప త్రిలో చేర్చుకు నేందుకు సిబ్బంది నిరాకరించారు. కాన్సు కోసం ఇక్క డిదాకా పంపించాలా దేవరకొండలో కాన్పు చేయలేరా అంటూ ఆంజ నేయులుపై అక్కడ సిబ్బంది విరుచుకుపడ్డారు. తన భార్యకు కాన్పు చేయమని కాళ్లా వేళ్లా పడ్డా సిబ్బంది కనికరించలేదని భర్త ఆంజనేయులు వాపోయాడు. సిబ్బంది వైద్యం చేయడా నికి నిరాకరించడంతో పురిటినొప్పులతో అశ్విని వీల్బైర్లోనే తీవ్ర రక్తస్రావమై ఆడపిల్లకు జన్మనిచ్చింది. దీంతో ఆస్పత్రి సిబ్బంది హడావుడిగా అశ్వినిని ఆస్పత్రిలో చేర్చుకొని తల్లి, శిశువుకు వైద్య సేవలు అందించారు. ఆస్పత్రి సిబ్బంది తీరును నిరసిస్తూ వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూఅశ్విని కుటుంబ సభ్యులు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు.

అదనపు కలెక్టర్ పూర్ణచంద్ర (Purnachandra)విచారణ నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రి లో సిబ్బంది నిర్లక్ష్యం వల్ల వీల్చైర్ లోనే మహిళ కాన్పు అయి న ఘటన వివరాలను తెలుసుకున్న కలెక్టర్ నారాయణరెడ్డి జరిగిన ఘటనపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అదనపు కలెక్టర్ పూర్ణ చంద్రను ఆదేశించారు. దీంతో అద నపు కలెక్టర్ పూర్ణచంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చి కాన్సు అయిన గర్భి ణి అశ్వినిని, ఆమె భర్త ఆంజనేయు లును వివరాలు అడిగి తెలుసుకు న్నారు. నివేదికను కలెక్టరు అంద చేస్తానని, విధుల పట్ల అలసత్వం వహించిన సిబ్బందిపై చర్యలు ఉంటాయని అని చెప్పారు.

ఆస్పత్రి ఘటనపై కలెక్టర్(collectir) ఆగ్ర హం …నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రి లో సిబ్బంది నిర్లక్ష్యంతో అశ్విని అనే గర్భిణి వీల్బైరైలోనే ప్రసవించిన ఘటనపై జిల్లా కలెక్టర్ సి. నారాయ ణరెడ్డి సీరియస్ అయ్యారు. కలెక్టర్ ఆదేశాలతో ఆస్పత్రిలో విచారణ జరిపిన అదనపు కలెక్టర్ పూర్ణచం ద్ర నివేదికను కలెక్టరుకు అందజే శారు. అశ్విని అనే గర్భిణీ ప్రసవం కోసం గురువారం రాత్రి దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చిందని ఆయన తెలిపారు. ఆ సమయంలో డ్యూటీ డాక డాక్టర్ శాంతి స్వరూప విధులలో లేకపోవడం, మత్తు డాక్ట ర్ లేడన్న కారణంతో అశ్వినిని కా న్పు కోసం నర్సులు నల్లగొండ ఆస్ప త్రికి పంపించారని అదనపు కలెక్టర్ పూర్ణచంద్ర పేర్కొన్నారు. దీంతో డ్యూటీలో ఉండాల్సిన డాక్టర్ కాంతి స్వరూప అక్కడ లేకపోవడం, నిర్ల క్ష్యంగా విధులు నిర్వహించిన స్టాఫ్ నర్స్ లు విజయలక్ష్మి, సైదమ్మ, మౌనిక, సరితలను సస్పెండ్ చే యాలని డీసీహెచ్ఎస్ సిఫారసు చేసినట్లు ఆయన తెలిపారు.
అంతకుముందే నల్గొండ ఆస్పత్రికి చేరుకున్న అశ్వినిని సిబ్బంది పరీ క్షించి ప్రసవానికి ఇంకా సమయం ఉందని చెప్పారని, అయితే ఆమె కుర్చీలోనే ప్రసవించిందని అదనపు కలెక్టర్ పూర్ణచంద్ర తెలిపారు. విధు ల్లో నిర్లక్ష్యం వహించిన డ్యూటీ డాక్ట ర్ నికిత, స్టాఫ్ నర్సులు ప్రమీల, ఉమ, పద్మ, సుజాతకు షోకాజు నోటీసులను జారీచేయాలని ఆదేశాలు జారీ చేశారు. సిబ్బంది ఇచ్చిన సమాధానాల తర్వాత చర్యలు ఉంటాయని పూర్ణచంద్ర స్పష్టం చేశారు