— ఎంజియూ ఉప కులపతి ఆచా ర్య కాజా అల్తాఫ్ హుస్సేన్
Qaza Altaf Hussain: ప్రజా దీవెన, నల్లగొండ: మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం బిజినెస్ మేనేజ్మెంట్ విభాగం మరియు ఆధ్వర్యంలో ఐ సి ఎస్ ఎస్ ఆర్ సహకారంతో సోషల్ సైన్సెస్ విభాగాలలో పరిశోధన పద్ధతులపై 10 రోజుల శిక్షణ తరగతుల కరపత్రాన్ని ఉప కులపతి ఆచార్య కాజా అల్తాఫ్ హుస్సేన్ (Qaza Altaf Hussain) తన కార్యా లయంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ మారుతున్న సాంకేతికతను (Technology) అందిపుచ్చుకొని నాణ్యమైన పరిశోధనలు జరగాలన్నారు. డిసెంబర్ 12 నుండి 21 వరకు నిర్వహించే శిక్షణ తరగతులకు దేశవ్యాప్తంగా యుజిసి గుర్తింపు పొందిన సంస్థల్లో యువ అధ్యాపకులు మరియు పరిశోధకులకు అవకాశం కల్పిస్తున్నట్లు కోర్సు కోఆర్డినేటర్ ఆచార్య అలువాల రవి తెలిపారు.
దేశవ్యాప్తంగా ఉన్న ఎన్ఐటి మరియు సెంట్రల్ యూనివర్సిటీ (NIT and Central University) అధ్యాపకులు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. స్థానికంగా పది మందిరికి , రాష్ట్ర వ్యాప్తంగా మందిరికి మరియు దేశవ్యాప్తంగా మరో 10 కలిపి మొత్తం 30 మందిరికి శిక్షణ ఇవ్వనున్నారు. నవంబర్ 21 లోగా ఉచితంగా https://wp.me/p4oUUY-hH లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన తెలిపారు. శిక్షణ తరగతుల్లో పరిశోధన ప్రాథమిక అంశాలు, విశ్లేషణ పద్ధతులు, తదితర 17 అంశాలపై శిక్షణలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. శిక్షణలకు సహ సంచాలకులుగా డా మిరియాల రమేష్, పాట్రన్ గా ఆచార్య బి సరిత, డా మారం వెంకటరమణారెడ్డి వ్యవహరిస్తారు.