Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Qaza Altaf Hussain: జాతి నిర్మాణంలో యువత భాగ స్వాములు కావాలి

–ఉపకులపతి ఆచార్య ఖాజా అల్తాఫ్ హుస్సేన్

Qaza Altaf Hussain: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం (Mahatma Gandhi University), 31వ ఆంధ్ర తెలంగాణ బెటాలియన్ సహకారంతో ఇంజ నీరింగ్ విద్యార్థులకు నేషనల్ క్యాడేట్ కార్ప్స్ లో రాత పరీక్ష మరియు దేహదారుడ్యా పరీక్ష ద్వారా ఎంపికలు చేపట్టారు. ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ సుధారాణి అధ్యక్షతన, ఉపకులపతి ఆచార్య అల్తాఫ్ హుస్సేన్ (Qaza Altaf Hussain) , 31వ బెటాలియన్ అధికారులు కల్నల్ లక్ష రెడ్డి మరియు ఎల్ మాధవరావులతో కలిసి ఇంజనీరింగ్ కళాశాలలో ఎన్సిసి కార్యాలయాన్ని ప్రారం భించారు, అనంతరం ఎంపికైన 36 మంది విద్యార్థులకు ఎన్సిసి ఉద్దేశాలు, లక్ష్యాలు, ఎన్సిసి కార్యకలాపాలను వివరించారు.

ఈ సందర్భంగా ఆచార్య అల్తాఫ్ హుస్సేన్ (Acharya Altaf Hussain) మాట్లాడుతూ బాధ్యతా యుతమైన యువత స్వతంత్ర లక్షణమని , జాతి నిర్మాణంలో వారి పాత్ర అత్యంత కీలకమన్నా రు. విద్యార్థి దశ నుండే తమను తాము మలుచుకుంటూ జాతి నిర్మాణంలో పరిపూర్ణ భాగస్వాము లు కావాలని పిలుపునిచ్చారు. క్రమశిక్షణ, జాతీయ భావాలు మరియు దేహదారుఢ్యం, పూర్ణ మూర్తిమత్వం కలిగిన పౌరులుగా తీర్చిదిద్దడంలో ఎన్సిసి పాత్ర మరువలేనిది అన్నారు. అనంతరం 31వ బెటాలియన్ కాల్నల్ లక్షారెడ్డి (Battalion Colonel Laksha Reddy) మాట్లాడుతూ దేశంలోనే 1.30 లక్షల యువ వాలంటీర్లు కలిగిన సంస్థగా దేశవ్యాప్తంగా 17 డివిజన్లో విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో, అత్యవసర సేవలందించడంలోనూ ముందుంటుంది అన్నారు.

ఎన్సిసి లో శిక్షణ పొందిన అనేకమంది సైన్యంలో పారా మిలిటరీలో (para military,), కేంద్ర మరియు ప్రభుత్వ రంగ సంస్థలలో క్రమశిక్షణ కలిగిన అధికారులుగా సేవలందించడం గర్వ కారణం అన్నారు. రాబోవు రోజుల్లో మరి ఒక యూనిట్ ద్వారా 40 మంది క్యారడేట్ లను ఎంజియూ నుండి ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఎం జి యు (mgu) విభాగానికి అసోసియేట్ ఎన్సిసి ఆఫీసర్గా డా మచ్చేందర్ ను నియమిస్తున్నట్లు వారి ద్వారా శిక్షణ తరగతులను నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఎన్జీ కళాశాల క్యాడేట్స్ ద్వారా అందించిన గాడ్ ఆఫ్ ఆనర్ అందరిని ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య అల్వాల రవి ఓ ఎస్ డి ఆచార్య కొప్పుల అంజిరెడ్డి, ప్రిన్సిపాల్ సుధారాణి, రేఖ, హరీష్ కుమార్, శ్రీనివాసరెడ్డి, బెటాలియన్ అధికారులు జగన్నాథం, మల్కప్ప, తదితరులు పాల్గొన్నారు.