Quiz competitions: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: భార తీయ రిజర్వ్ బ్యాంక్ (rbi)స్థాపించి 90 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న సంద ర్భంగా సంస్థ ఆధ్వర్యంలో డిగ్రీ అభ్యసిస్తున్న 25 సంవత్సరాల లోపు విద్యార్థులకు క్విజ్ పోటీ (Quiz competitions)లను నిర్వహిస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (rbi)ఏజీఎం ఎస్ గోమతి తెలియజే శారు. కార్యక్రమ పోస్టర్ ను రిజిస్ట్రార్ ఆచార్య అలు వాల రవి, ఓ ఎస్ డి ఆచార్య కొప్పుల అంజిరెడ్డిలతో కలిసి మహాత్మా గాంధీ విశ్వ విద్యా లయంలో బుధవారం ఆవి ష్కరిం చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లా డుతూ జాతీయ స్థాయిలో నిర్వహించనున్న క్విజ్ పోటీలలో (Quiz competitions) ఇద్దరేసి విద్యార్థులు ఒక జట్టుగా పాల్గొనవచ్చునని, ఒక కళాశాల నుండి ఎన్ని జట్లైనా సరే అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు. మొ దటి విడత ఆన్లైన్ ద్వారా నిర్వహించిన అనంతరం రెండు దశ రాష్ట్రస్థాయి, మూడు దశ జోనల్, నాలుగు జాతీయ స్థాయిలో నిర్వహించనున్నారు.
జాతీయ స్థాయి మొదటి బహుమతి పది లక్షల నగదు, రెండవ బహుమతి ఎనిమిది లక్షలు మూడవ బహుమతి ఆరు లక్షల నగదు బహుమతి ఇవ్వనున్నారు. డిగ్రీ విద్యార్థులు క్యూ ఆర్ కోడ్ (QR code) ద్వారా ఇద్దరేసి విద్యార్థులు ఒక్క జట్టుగా పేర్లు నమోదు చేసుకుని మొదటి దశలో పాల్గొనాలని తెలిపారు. రెండు మూడు నాలుగు దశల్లో పాల్గొనే విద్యార్థుల రవాణా మరియు వసతి సదుపాయాలను సంస్థ భరిస్తుందని తెలిపారు. పేర్ల నమోదు కొరకు ఆర్బిఐ వెబ్ సైట్ లో (rbi website)క్యూఆర్ కోడ్ అందుబాటులో ఉన్నట్లు, కళాశాలలో సైతం గోడ పత్రులు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థాపించి 90 ఏళ్లు పూర్తి చేసుకున్న సంద ర్భంగా సంస్థ ఉద్దేశాలు ఖ్యాతి మరియు ఆర్థిక అక్షరా స్యతను ప్రజల్లోకి తీసు కువెళ్లే ఉద్దేశంతో ఈ కార్య క్రమాన్ని నిర్వహించను న్నట్లు , మున్ముందు గ్రామ, పాఠశాల మరియు కళాశాల, విశ్వవిద్యాలయ స్థాయిల్లో కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో యు సి సి బి ఎం కళాశాల ప్రిన్సిపాల్ డా మారం వెంకట రమణారెడ్డి, డా కె ప్రేమ్ సాగర్, పి ఆర్ ఓ డా లక్ష్మల్ల మధు, ఆర్బిఐ డిస్ట్రిక్ట్ మేనేజర్ టి. శ్రామిక్, ఎస్బిఐ అనేపర్తి బ్రాంచ్ మేనేజర్ రమ్య పాల్గొన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
