Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Raghu Veer Reddy:దేవరకొండ నియోజకవర్గ అభివృద్ధే నా లక్ష్యం

–15 రోజులలో పాఠశాల విద్యార్థు లకు మంచినీటి సౌకర్యం కల్పిస్తాం
–నల్లగొండ ఎంపీ కుందూరు రఘు వీర్ రెడ్డి

Raghu Veer Reddy:ప్రజా దీవెన, నల్లగొండ: దేవరకొండ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే మా లక్ష్య మని నల్లగొండ పార్లమెంట్ సభ్యు డు కుందూరు రఘువీర్ రెడ్డి (Raghu Veer Reddy) అన్నారు.ఎంపీ ఎన్నికల్లో దేవర కొండ ప్రజలు తమ విలువైన ఓటు ను కాంగ్రెస్ పార్టీకి వేసి అత్యధిక మెజార్టీ (overwhelming majority)ఇచ్చినందుకు ధన్యవా దాలు తెలుపుతూ దేవరకొండ ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని చెప్పారు. నల్లగొండ జిల్లా నేరేడుగొమ్ము మండల కేంద్రం లో నూతనంగా రూ. 3 కోట్ల 50 లక్షల వ్యయంతో నిర్మించిన కస్తూ ర్బా గాంధీ బాలికల పాఠశాల భవ న ప్రారంభోత్సవ కార్యక్రమానికి ము ఖ్య అతిథిగా హాజరైన నల్లగొండ ఎంపి కుందూరు రఘువీర్ రెడ్డి దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ తో కలిసి కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను ప్రారంభించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశీస్సులతో దేవ రకొండ ఎమ్మె ల్యే(mla) బాలు నాయక్ తో కలిసి దేవరకొండ అభివృద్ధి లక్ష్యంగా నిత్యం మీకు అన్నివేళల్లో అందుబాటులో ఉంటానన్నారు.

తెలంగాణ రాష్ట్రం లో (telangana state) ప్రతి నియోvజకవర్గంలో 25 ఎక రాల విస్తీర్ణంలో ఒక ప్రతిష్ఠాత్మక మైన ఇంటిగ్రేటెడ్ పాఠశాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దేవర కొండ ఎమ్మేల్యే బాలూ నాయక్ మాట్లాడుతూ వచ్చే 15రోజుల్లో పాఠశాల విద్యార్థులకు మంచినీటి సౌకర్యం కల్పిస్తామని, దేవరకొండ నియోజకవర్గం (Devarakonda Constituency)వెనుక బడిన ప్రాంతం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం సబండవర్గాల ప్రజలు అందరూ ఏకమై ఉద్యమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్రం రావ డానికి కారకులయ్యారని గుర్తు చేశారు. గత పాలకులు10 ఏండ్లు పాలించిన దేవరకొండ ప్రాంతం Devarakonda Constituency)పది సంవత్సరాలు వెనుకబడిపోయింది కానీ ఏ మాత్రం అభివృద్ధి జరగ లేదని విచారం వ్యక్తం చేశారు. అందరూ కోరుకుంటున్న విదంగా ప్రజా తెలంగాణలో దేవరకొండ నియోజకవర్గం (Devarakonda Constituency) ఈ నల్లమల్ల ప్రాం తం విద్యా వైద్యం ఉపాధి ఇరిగేషన్ రంగాల్లో పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడానికి నేను కృషి చేస్తానని చెప్పారు. నియోజకవర్గంలో స్థానిక ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి సహకారంతో అన్ని రంగాల్లో అభి వృద్ధి చేయడానికి కృత నిశ్చయం తో పని చేస్తామని ఎమ్మెల్యే (mla) ఎలక్షన్ లలో ఎలాగైతే మీరందరూ నాకు ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించారో అంతే ఉత్సాహంతో ఎంపీ ఎలక్షన్ లో కుందూరు రఘువీర్ రెడ్డికి (Raghu Veer Reddy) కూడా మీ యొక్క అమూల్యమైన ఓట్లు వేసి గెలి పిం చారని గుర్తు చేశారు. కాబట్టి ప్రజ లందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నామని ఈ కార్య క్రమంలో ఎం ఈ ఓ సౌమ్య నాయ క్, ఎస్ ఓ, నియోజక వర్గ ప్రజా ప్రతి నిధులు, నాయకులు, వివిధ అను బంధ సంఘాల నాయకులు, యువ జన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.