Rakshabandhan: ప్రజా దీవెన, నల్లగొండ: మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల (Mahatma Gandhi University Arts College) లో ఆనం దోత్సాహాల మధ్య రక్షాబంధన్ జరుపుకున్న అధ్యాపకులు. ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ కార్యాలయంలో ప్రిన్సిపాల్ కె అరుణ ప్రియ, అనిత కుమారి, ప్రగతిలు అధ్యాపకులకు రాఖీలు (rakhis)కట్టి ఆత్మీయ సోదర భావాన్ని చాటారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ అరుణ ప్రియ మాట్లాడుతూ పని ప్రదేశాల్లో మరీ ముఖ్యంగా జీవితకాలం ఒకే చోట కొనసాగాల్సిన విశ్వవిద్యాలయాల్లో సహోదయోగుల మధ్య సోదర భావం, ప్రేమానురాగాలు బాధ్యతలు, ఆత్మీయతలు (responsibilities)పని ఒత్తిడిని , స్వార్థాలను అధిగమించేందుకు అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో ఓ ఎస్ డి ఆచార్య కొప్పుల అంజిరెడ్డి, లక్ష్మల్ల మధు, శ్యాంసుందర్, రామకృష్ణ, షరీఫ్ శ్రీకాంత్, ఆనంద్ అరవింద్, సైదులు, లచ్చు నాయక్ తదితర అధ్యాపకులు పాల్గొన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.