**పాలకూర రవి గౌడ్**
**బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి**
Ravi goud: ప్రజా దీవెన ,నల్గొండ టౌన్:బిజెపి రాష్ట్ర కార్యాలయం పై కాంగ్రెస్ ముఖలు పాల్పడిన దాడిపట్ల బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి పాలకూరి రవిగౌడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఈ దాడికి పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ బాధ్యత వహిస్తూ సమాధానం చెప్పాలని కోరారు..
కార్యాలయాలపై రాళ్ళు, కోడిగుడ్లు వేయడాలు ప్రజాస్వామ్యంలో ఇది సమంజసం కాదని చట్ట వ్యతిరేక పనులను కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహించడం మూర్ఖత్వం చర్య అని కాంగ్రెస్ పార్టీ ముకలను రవిగౌడ్ హెచ్చరించారు..
ఎవరైనా తప్పుడు వ్యాఖ్యలు చేసినట్లయితే ప్రజాస్వామ్య బద్దంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉందని ,అవసరమైతే చట్టపరంగా కూడా శిక్షించవచ్చు,అంతేకానీ రాష్ట్రంలో అధికారం చేతిలో ఉంది అని చట్టాన్ని చేతిలోకి తీసుకొని భయభ్రాంతులకు గురి చేస్తూ కార్యాలయాల పైన దాడులకు తెగబడడం ఇది దుర్మార్గమైన చర్యగా భావిస్తున్నామని రవి గౌడ్ తెలిపారు.. కార్యాలయం పైన దాడికి పాల్పడ్డ కాంగ్రెస్ పార్టీ ముఖలను అరెస్టు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం..