RDO office: ప్రజాదీవెన నల్గొండ టౌన్ : నల్లగొండలోని ఆర్డీవో కార్యాలయంలో శ్రీ జగిని టెక్స్ టైల్స్, జగిని దంత వైద్యశాల సంయుక్తగా నిర్వహిస్తున్న చలివేంద్రాన్ని ఆర్డీవో అశోక్ రెడ్డి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతు జగిని వెంకన్న సామాజిక సేవల పట్ల, ఆర్డీవో కార్యాలయం ప్రాంగణం లో చలివేంద్రం, విజిటర్స్ కూర్చోవటానికి బెంచీలు ఏర్పాటు చేయటం అభినందనీయమన్నారు.
జగిని టెక్స్ టైల్స్ అధినేత వెంకన్న మాట్లాడుతు గత పదమూడు సంవత్సరాలనుండి పట్టణ ప్రధాన కూడళ్ళలో పదకొండు చలివేంద్రంలు నిర్వహిస్తున్నమని, ఇతర సామాజిక సేవలు ప్రజలకు అందిస్తున్నామని తెలిపారు. జగిని దంత వైద్య శాల ద్వారా పేద ప్రజలకు ఉచిత వైద్య సేవలు చేస్తునమని తెలిపారు.
ఈ కార్యక్రమం లో డాక్టర్ ఆదిత్య, సతీష్,రామకృష్ణ, వెంకటేష్, రవి,నర్సింహా,శంకర్, రాములు తదితరులు పాల్గొన్నారు.