ప్రజా దీవెన, నల్లగొండ బ్యూరో: నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి మండలం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్వగ్రామమైన బ్రాహ్మణవెల్లెంల లో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ను సీఎం రేవంత్రెడ్డి శనివారం ప్రారంభించనున్నారు. దీంతో రెండు దశాబ్దాల కల సాకా రం కానుంది. కరువు, ఫ్లోరైడ్ ప్రభా విత ప్రాంతాలకు సాగు, తాగు నీటిని అందించడమే లక్ష్యంగా 20 05 ఆగస్టులో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉదయ సముద్రం ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు.
2007లో రూ.699 కోట్ల అంచనా వ్యయంతో పనులు ప్రా రంభమయ్యాయి. 6.70 టీఎంసీల నీటిని ఎత్తిపోసి నార్కట్పల్లి, న ల్గొండ, చిట్యాల, మునుగోడు, రామన్నపేట, శాలిగౌరారం, కట్టం గూరు, నకిరేకల్, తుంగతుర్తిలోని లక్ష ఎకరాలకు సాగునీరు అందిం చడానికి వీలుగా నిర్మాణం చేశారు. 2015, 2021లో ప్రాజెక్టు నిర్మాణ అంచనా వ్యయాన్ని సవరించారు. ఇప్పటిదాకా రూ.469.95 కోట్లను వెచ్చించారు. మరో రూ.204.72 కోట్ల పనులు జరగాల్సి ఉంది. ఉదయ సముద్రం ప్రాజెక్టులో భాగంగానే 0.302 టీఎంసీల సామర్థ్యంతో బ్రాహ్మణ వెల్లెంల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ను నిర్మించారు. హెడ్వర్క్లతో పాటు అప్రోచ్ చానల్, ప్రెషర్ మెయిన్ పనులు పూర్తయ్యాయి. ఈ రిజ ర్వాయర్ కింద ఎడమ ప్రధాన కా లువ కింద 43 వేల ఎకరాలు, కుడి ప్రధాన కాలువ కింద 57 వేల ఎక రాలకు సాగునీటిని అందిస్తారు. తొలిదశలో మునుగోడు కింద 2,9 08 ఎకరాలు, నల్గొండ నియోజ కవర్గంలో 22,750 ఎకరాలు, నకి రేకల్లో 23 వేల ఎకరాలకు సాగు నీటిని అందించనున్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
