Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

RTC Buses: సరిపడ బస్సులు లేక ప్రయాణికుల ఇక్కట్లు

ప్రజా దీవెన ,నల్గొండ టౌన్: రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో కల్పించే ఉచిత ప్రయాణంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు నల్గొండ బస్టాండ్ నుంచి దేవరకొండ వైపు వెళ్లే ప్రయాణికులకు సరిపడ బస్సులు అందుబాటులో లేక పోవడంతో గంటల తరబడి వేచి చూసే పరిస్థితి ఏర్పడుతుంది..

రద్దీగా ఉన్న ప్రాంతాలకి ప్రయాణికులకు అనుగుణంగా బస్సులను నడపాలని ప్రయాణికులు కోరుకుంటున్నారు.రద్దీ ఎక్కువగా ఉండటం వలన సరిపడా బస్సులు లేకపోవడంతో చిన్నపిల్లలతో ప్రయాణం చేసేవాళ్లు అదేవిధంగా వృద్ధులు ఉచిత ప్రయాణం అంటేనే బెంబేలెత్తిపోతున్నారు.ప్రభుత్వం కల్పించిన ఉచిత ప్రయాణాలను మహిళలు సద్వినియోగం చేసుకున్నప్పటికీ సిబ్బంది మాత్రం దురుసుగా ప్రవర్తిస్తున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు ప్రయాణికులపై దురుసుగా ప్రవర్తించే సిబ్బందిని గుర్తించి వారి పైన చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు..