RTC Pallevelugu: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: గతంలో నడిచిన ఆర్టీసీ (RTC) పల్లె వెలుగు బస్సులను తిరిగి పునరుద్ధరించి యధావిధిగా గ్రామీణ ప్రాంతాలకు నడిపించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యు లు బండా శ్రీశైలం కోరారు. శనివా రం ఆర్టీసీ రీజినల్ మేనేజర్ రాజశే ఖర్ కు వినతి పత్రం సమర్పిం చారు. ఈ సందర్భంగా శ్రీశైలం (Srisailam) మాట్లాడుతూ గతంలో మునుగోడు పలివెల దిల్ సుఖ్ నగర్ బస్సు గుజ్జ గ్రామపంచాయ తీ వరకు పోయే బస్సు రద్దు చేశా రు, అదే విధంగా నల్గొండ పులిప లుపుల వయా మునుగోడు ఊ కోండి వరకు, మునుగోడు చెల్లేడు గట్టుపల్ వరకు వెళ్లే బస్సు, మును గోడు మాల్ శివన్న గూడెం మీదు గా వెళ్లే మరొక బస్సు 5 మునుగో డు కల్వకుంట్ల వరకు మరొక బస్సు నార్కట్పల్లి డిపో బస్సు (Narkatpally Depot Bus) వయా చౌటుప్పల్ రాత్రి గుజ్జ బస చేసే బస్సు సుమారు ఆరు బస్సులను ఈ మధ్యకాలంలో నిలిపివేయడం జరిగిందని తెలిపారు.
దీనితో ప్రజలు చేనేత చేతివృత్తుల వారు చిరు వ్యాపారులు హైదరాబాదుకు పోయి జీవనోపాధి పొందే నిరుపేద లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా రని అన్నారు. విద్యార్థులు ఇంటర్ డిగ్రీ పిజి (Inter Degree PG)చదువుల కోసం జిల్లా కేంద్రానికి వచ్చేవారికి తీవ్ర ఆటంకం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ అధికారులు తక్ష ణం తర్వాత తీసుకొని ఆగిపోయిన పల్లె వెలుగు బస్సులను పునరుద్ధ రించి చిరు వ్యాపారులను విద్యా ర్థులను చేతివృత్తుల వారిని ఆదు కోవాలని కోరారు. ఈ కార్యక్ర మంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యు లు కర్నాటి మల్లేశం, పిఎసిఎస్ చైర్మన్ దోడ యాదవ రెడ్డి, మును గోడు మండల కార్యదర్శి సాగర్ల మల్లేష్, మండల నాయకులు మిర్యాల భరత్, వరికుప్పల ముత్యాలు, కర్నాటి సుధాకర్, పగిళ్ల మధు, కొత్తపల్లి నరసింహ, కర్నాటి వెంకటేశ్వర్లు, చాడ నరసింహ, పెద్దగోని నరసింహ, ఒంటెపాక అయోధ్య తదితరులు పాల్గొన్నారు.