ప్రజా దీవెన, నల్గొండ: హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో చెరువుగట్టు శ్రీ శ్రీ జడల రామలింగేశ్వర స్వామి దేవాలయం లో సాంప్రదాయమైనటువంటి దుస్తులు ధరించి రావాలని అదేవిధంగా ఉగాది పండుగను నూతన సంవత్సరంగా జరుపుకోవాలని ప్ రాష్ట్ర కార్యదర్శి సంగపాక రాంబాబు కోరారు..
రాంబాబు హిందువులందరూ కూడా గుడికి సాంప్రదాయ మైన దుస్తులు ధరించి రావాలని ముఖ్యంగా మహిళలు చీరకట్టు లేదా చుడిదార్ తో గుడికి రావాలని నుదుటన బొట్టు పెట్టుకొని రావాలని, సాంప్రదాయేతర దుస్తులు వేసుకొని రాకూడదు అని పురుషులు పంచ కట్టు లేదా ఫార్మల్ డ్రెస్ లో రావాలని పొట్టి పొట్టి నెక్కర్లు టీషర్టుతో గుడికి రాకూడదు అని అన్నారు అదేవిధంగా ఆంగ్ల నూతన సంవత్సరాన్ని హిందువులు జరుపుకోవద్దని ప్రకృతిలో మార్పులు వచ్చేటువంటి ఉగాదిని నూతన సంవత్సరంగా జరుపుకోవాలని కోరారు..