Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Santosh: డ్రగ్స్ రహిత సమాజం కోసం పాటుపడుదాo

–మాదక ద్రవ్యాల నిర్మూలనలో భాగస్వాములవుదాం
–జిల్లా ప్రొహిబిషన్ ఎక్సైజ్ సూరింటెండెంట్ బి సంతోష్

Santosh: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్ : మాదక ద్రవ్యరహిత నవ సమాజ కోసం ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా ప్రొహిబిషన్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ బి సంతోష్ (Santosh) విద్యా ర్థులకు యువకులకు సూచించారు.జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి (Narayana Reddy)ఆదేశాల మేరకు ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ నల్గొండ వారి ఆధ్వర్యంలో సోమవారం మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా అవగాహన ర్యాలీ జిల్లా కేంద్రంలోని గడియారం సెంటర్లో మానవహారం నిర్వహించారు.

మానవ హారం అనంతరం విద్యార్థుల (of students)చే ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గంజాయి, డ్రగ్స్ కు అలవాటు పడకుండా విద్యార్థులు విద్యపై ప్రత్యేక దృష్టిసారించి ఉన్న తస్థానాలకు ఎదగాలని అన్నారు. చెడు వ్యసనాలకు అలవాటు పడితే భవిష్యత్తును కోల్పోతారని సూచించారు.డ్రగ్స్ మాదక ద్రవ్య రహిత (Drugs are non-narcotic) నవ సమాజ నిర్మాణంలో విద్యార్థుల పాత్ర గురించి తెలియజేశారు. అలాగే మిర్యాలగూడ, హాలియా, దేవరకొండ, నాంపల్లి, చండూరు, నకిరేకల్ ప్రధాన కేంద్రాలలో ఎక్సైట్ ఇన్స్పెక్టర్ల ఆధ్వర్యంలో కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించడం జరిగిందని సూపర్డెంట్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరిండెంట్స్ బి. చాణక్య, ఎ.. కిషన్, రాకేష్, బి. ప్రసాద్ ఇన్స్పెక్టర్స్ బి. ప్రసాద్ సిబ్బంది పాల్గొన్నారు.