Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Sarat Chandra Pawar: త్వరితగతిన పెండింగ్ కేసుల క్లియరెన్స్

–ఫోక్సో, గ్రేవ్ కేసుల్లో త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ పూర్తి
–రోడ్డు ప్రమాదాలు, దొంగతనాల ముందస్తు నివారణ చర్యలు
–మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవ గాహన కార్యక్రమాలు
–నల్లగొండ జిల్లా యస్ పి శరత్ చంద్ర పవార్

Sarat Chandra Pawar: ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీసు అధికారులతో నిర్వహించి న నెలవారి నేర సమీక్షా సమావే శంలో పెండింగ్ కేసులు లేకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని, పెండింగ్ కేసులను త్వరితంగా పరిష్కరిస్తూ పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించడానికి ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారులను నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ (Sarat Chandra Pawar) ఆదేశించారు. పెండింగ్ లో ఉన్న అండర్ ఇన్వెస్టిగేషన్ కేసు లలో గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసుల గురించి అడిగి, గ్రేవ్ నాన్ గ్రేవ్ కేసులలో ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ప్రతి కేసులో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ తో పూర్తి పారదర్శకంగా చేయాలి అన్నారు. కేసు నమోదు నుండి చార్జిషీట్ వరకు ప్రతి విషయాన్ని కూలంకుషంగా పరిశోధన చేసి ఫైనల్ చేయాలి అన్నారు. ఫోక్సో, గ్రేవ్ కేసుల్లో త్వరితగతిన ఇన్వె స్టిగేషన్ పూర్తి చేసి కోర్టులో చార్జి షీట్ దాఖలు (Filing of charge sheet) చేయాలని అన్నారు.

ప్రతి అధికారికి పూర్తి ఇన్వెస్టిగేషన్, స్టేషన్ మేనేజ్మెంట్ (Investigation, Station Management) తెలిసి ఉండాలని సూచించారు. అవసరమైతే సంబం ధిత న్యాయమూర్తులను స్వయం గా కలిసి కేసుల పరిష్కారానికి మరింత చొరవ చూపాలని సూ చించారు. దీర్ఘకాలంగా పెండిం గులో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి సారించి వెంటనే వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని, పెండింగ్ కేసుల విషయంలో నిరంతర పర్యవేక్షణ ఉంటుందని, కొత్త కేసులతో (new cases) పాటు చాలా కాలంగా పెండింగ్ కేసులను ఎప్పటికప్పుడు సమీక్షించడం ద్వారా కేసుల సంఖ్య తగ్గించే దిశగా అన్ని స్థాయిల అధికారులు పని చేయాలన్నారు. ఫంక్షనల్ వర్టికల్స్ పటిష్ట అమలు పరుస్తూ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉంటూ సంవర్దవంతమైన సేవలు అందజేస్తు సత్వర న్యాయం చేసేలా కృషి చేయాలని అన్నారు. మిషన్ పరివర్తన్ కార్యక్రమంలో భాగంగా మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ గంజాయి రహిత జిల్లాగా ఏర్పాటు చేయాలి అన్నారు. కమ్మునిటీ పోలిసింగ్ ద్వారా గ్రామాలలో సిసిటీవి లు ప్రాముఖ్యత అవగాహన కల్పిస్తూ ఏర్పాటుకు కృషి చేయాలని అన్నారు.

సైబర్ క్రైమ్, డయల్ 100 వాటి వినియోగంపై విద్యార్థులు, ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.జిల్లాలో దొంగతనాలు జరగకుండా పగలు, రాత్రి సమయాల్లో పెట్రోలింగ్ లు చేస్తూ ముందస్తు నివారణ చర్యలు చేపట్టాలని పాత నేరస్థుల కదలికలపై నిఘా పెడుతూ విజిబుల్ పోలీసింగ్, పెట్రోలింగ్ ముమ్మరం (Visible policing and increased patrolling)చేయాలని, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. అసాంఘిక కార్యకలాపాలు గంజాయి, జూదం, అక్రమ ఇసుక పి.డి.యస్ రవాణా లాంటి వాటిపై ప్రత్యేక దృష్టి సారించి పటిష్టమైన చర్యలు తీసుకోని నియంత్రించాలని అన్నారు. ప్రతి ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, వారి ఫిర్యాదులను స్వీకరించి జవాబుదారీగా ఉంటూ బాధితులకు సత్వర న్యాయం జరిగే విధంగా పని చేయాలని తెలియజేశారు. నల్లగొండ జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, నేషనల్, స్టేట్ హైవే ( National, State Highway)లో ఉన్న అన్ని బ్లాక్ స్పాట్లను పరిశీలించి ప్రమాదాల గల కారణాలను తెలుకొని వాటి నియంత్రణకు కావలసిన ఇతర సంబంధిత అధికారుల సమన్వయంతో పని చేయాలని అన్నారు. ప్రతి గ్రామాలలో రోడ్డు భద్రతా కమిటీలను ఏర్పాటు చేసి ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తెలిపారు.

రోడ్డు భద్రతా నియమావళి పైన అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. ప్రమాదాలు జరగకుండా ప్రతీ రోజు డ్రంక్ అండ్ డ్రైవ్ (drunk and drive) లు నిర్వహించాలని అన్నారు. ఓవర్ స్పీడ్, ట్రిపుల్ డ్రైవింగ్, మైనర్లు వాహనాలు నడుపుట లాంటి వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టి స్పెషల్ డ్రైవ్ లు నిర్వహించాలని అన్నారు. ఈ సమావేశంలో అడిషనల్ యస్.పి రాములు నాయక్, యస్.బి డియస్పి రమేష్, నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి, మిర్యాలగూడ డిఎస్పీ రాజశేఖర రాజు, దేవరకొండ డియస్పి గిరిబాబు, సైబర్ క్రైమ్ డీఎస్పీ లక్ష్మి నారాయణ, సి.ఐ లు మరియు యస్.ఐ లు, తదితరులు పాల్గొన్నారు.