Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Sarat Chandra Pawar: డ్రగ్స్ నియంత్రణలో మీడియా ప్రముఖ పాత్ర పోషించాలి

–మిషన్ పరివర్తన్ కార్యక్రమానికి విస్తృత ప్రచారం కల్పించండి
–గంజాయి అనే సామాజిక రుగ్మత ను రూపుమాపాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది
–నల్లగొండ జిల్లా కలెక్టర్ నారాయ ణ రెడ్డి, ఎస్పి శరత్ చంద్ర పవార్

Sarat Chandra Pawar:ప్రజా దీవెన, నల్లగొండ: “నేను గంజాయి వాడను” అనే నినాదంతో ఈ నెల 14 నుండి వారం రోజులపాటు నల్గొండ జిల్లాలో సామాజిక మాధ్యమాలు, ప్రింట్ ,ఎలక్ట్రానిక్ మీడియా (Social Media, Print, Electronic Media)ద్వారా ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా నల్గొండ జిల్లాను తీర్చి దిద్దడంలో భాగంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన “మిషన్ పరివర్తన్ ” కార్యక్రమం కింద సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల అవగాహన సదసుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

అన్ని రకాల వార్తలను ప్రజలకు వేగంగా తీసుకు వెల్లేది మీడియా మాత్రమేనని, మాదక ద్రవ్యాల నియంత్రణలో మీడియా చాలా ముఖ్యమని అన్నారు. జిల్లాలోని కొన్ని గ్రామాలు ,మున్సిపాలిటీలలో గాంజాయిని వాడుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందని, గంజాయితో పాటు, మత్తు కలిగించే కొన్ని ట్యాబ్లెట్లను సైతం అక్రమంగా వాడుతున్నారని ,డాక్టర్ల ఫ్రీస్క్రిప్షన్ లేకుండానే వాడుతున్నట్లు తమ దృష్టికి వచ్చినట్లు కలెక్టర్ తెలిపారు.సినిమాలు,సమాన వయసున్న వారివల్ల గంజాయి వాడకానికి ఒక కారణంగా గుర్తించినట్లు తెలిపారు.గంజాయి అనేది ఒక సామాజిక రుగ్మత అని, దాన్ని రూపు మాపాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. ముఖ్యంగా యువతను, వారి కుటుంబాలను మేల్కొల్పాల్సిన అవసరం ఉందన్నారు. గడిచిన వారం రోజులుగా మాదక ద్రవ్యాల నిరోధంలో భాగంగా జిల్లాలో ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నదని, ఇందులో భాగంగా మీడియాకు సైతం అవగాహన కల్పించేందుకు ఆవగాహన సదస్సు ఏర్పాటు చేశామని తెలిపారు.

ఆగస్టు 14 నుండి యూట్యూబులు, వాట్స్అప్, ఫేస్ బుక్, ట్విట్టర్ ,ఇన్ స్టాగ్రామ్ (WhatsApp, Facebook, Twitter, Instagram) లలో” నేను గంజాయివాడను” అనే నినాదంతో సామాజిక మాధ్యమాల ద్వారా ముందుకు వెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. అంతేకాక ప్రతి ఒక్కరూ “నేను గంజాయి వాడను” అనే “డిపిని” వాట్సప్ లలో ప్రదర్శించాలని కోరారు. గంజాయి నియంత్రణలో భాగంగా ప్రతివారం కొంతమందికి కౌన్సిలింగ్ ఇస్తున్నప్పటికీ, ఇంకా పెద్ద ఎత్తున అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు. అందుకోసం అందరం గట్టిగా ఎదుర్కొన్నప్పుడే నియంత్రణ సాధ్యమవుతుందని, ఇందుకు కలిసికట్టుగా పోరాటం చేయాల్సి ఉందని అన్నారు. గంజాయి వాడడం వల్ల కలిగే నష్టాలపై ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, పిల్లలకు, తల్లిదండ్రులకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని అన్నారు.

జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ (SP Sarath Chandra Pawar)మాట్లాడుతూ, మత్తు పదార్థాలు తీసుకోవడం వల్ల కలిగే దుష్పరిణాలపై గత వారం రోజులు ప్రత్యేక ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఒకసారి గంజాయి కి అలవాటు పడిన తర్వాత ఆ మత్తు వదలదని, అందువలన ఎవరు గంజాయి వాడకుండా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. విద్య,వైద్యం, పోలీస్, ఎక్సైజ్ ,వ్యవసాయ తదితర శాఖల ద్వారా వ్యాసరచన ,వక్తృత్వ పోటీలు, ర్యాలీలు ,అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని,గంజాయి వల్ల కలిగే నష్టాలను తెలియజేస్తు న్నామని తెలిపారు. ఈ వారం రోజుల్లో 120 మందికి కౌన్సిలింగ్ సైతం ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు. గంజాయి వినియోగించడం,రవాణా చేయడం తప్పేనని, గంజాయి వినియోగిం చిన, ఆమ్మిన ఆరు నెలల జైలు శిక్ష ఉంటుందని తెలిపారు. గంజాయి నుండి బయటపడిన వారికి జిల్లా కలెక్టర్ రీహాబిలిటేషన్ సెంటర్ ఏర్పాటుకు అంగీకరించడం పట్ల ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ఎక్కడ గంజాయి అమ్మినా, వాడిన,పండిం చిన తమ దృష్టికి తీసుకురావాలని ఆయన మీడియాను కోరారు. జిల్లాలోని మీడియాతో పాటు ప్రజలందరూ మత్తు పదార్థాల కు సంబంధించి టోల్ ఫ్రీ నెంబర్ 8712670266 కు ఫోన్ చేసి తెలియజేయవచ్చని, వివరాలను గోప్యంగా ఉంచడం జరుగుతుందని, ఎవరైనా సరే టోల్ ఫ్రీ నెంబర్ కు తెలియజేయవచ్చని ఆయన పేర్కొన్నారు. జిల్లాలో గంజాయి సాగు లేనిప్పటికీ వినియోగం జరుగుతున్నదని తెలిపారు. కామినేనిలో రెండు రిహాబిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు చేశామని ఈ సందర్భంగా ఆయన వివరించారు. అంతకు ముందు సైక్రియాటిస్ట్ శివ గంజాయి వల్ల కలిగే నష్టాలు, గంజాయి తీసుకున్న వారి లక్షణాలు, తదితర అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.గంజాయి కి సంబంధించిన వార్తల పై జిల్లా పౌర సంబంధాల అధికారి యు.వెంక టేశ్వర్లు వివరించారు.అడిషనల్ ఎస్పి రాములు నాయక్(Additional SP Ramulu Naik_, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి పోట్ల శ్రీనివాసులు, ఎక్సైజ్ ఈ ఎస్ బి చాణక్య, తదితరులు మీడియా అవగాహన సదసుకు హాజరయ్యారు.