Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

SBI: నల్లగొండ జిల్లాలో ఎస్బిఐ బ్యాంకు లూటీ

ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లా దామచర్ల మండల కేంద్రంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాం కు ఏటీఎం ను గుర్తుతెలియని కొం దరు దుండగులు లూటీ చేశారు. దీంతో స్థానిక పోలీసులు అందిం చిన సమాచారం మేరకు నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఘటన స్థలానికి చేరుకొని పూర్తిస్థాయి పరిశీలనతో పాటు వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ లూటీలో దాదాపు రూ. 20 లక్షల నుంచి రూ. 30 లక్షల నగదు చోరీ గురైనట్టు ప్రాథమిక సమా చారం మేరకు తెలుస్తుంది. దోపిడీకి వచ్చిన దుండగులుసీసీ కెమెరాకు పెప్పర్స్ కొట్టిన ఆనవాళ్లు కనబడుతున్నాయి. దీంతో పోలీ సులు అప్రమత్తమై నాలుగు బృం దాలుగా ఏర్పడి క్లూస్ టీం, డాగ్స్ స్క్వాడ్ తో పరిశీలన చేస్తున్నారు.

అప్పటికప్పుడే అలర్ట్ అయిన పోలీస్ యంత్రాంగం తొలుత దామరచర్ల మండల కేంద్రాన్ని చుట్టుముట్టిoది. వెలువెంటనే దర్యాప్తు కార్యకలాపాలు ప్రారం భించడంతో దుండగులు సాధ్య మైనంత త్వరితగతిన పట్టుబడే అవకాశం ఉందని భావిస్తున్నారు.