Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

SC Cell Chairman Boda Swamy: గాదరి కిషోర్ నోరు అదుపులో పెట్టుకోవాలి

–నల్గొండ జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ బోడ స్వామి

SC Cell Chairman Boda Swamy: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్ : నల్ల గొండ మంత్రి కోమటిరెడ్డి వెంకటరె డ్డి (Komati Reddy Venkata Reddy) పై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని నలగొండ జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ బోడస్వామి (SC Cell Chairman Boda Swamy) గాదరి కిషోర్ ను డిమాండ్ చేశారు. సందర్భంగా ఆయన మాటల యుద్ధంతో విరుచుకుపడ్డారు. నల్లగొండ పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పదెండ్లు తుంగతుర్తి దళితుల దరిద్రుడివి పదేళ్లపాటు తుంగతుర్తి దారిద్రుడివి నీవు అని తెలియక నిన్ను భరించి నీ మాయ మాటలు నమ్మి తుంగతుర్తి ప్రజలు మోసపోయి నువ్వు అక్కడ పది ఏండ్లు ఉండి రక్తాన్ని తాగి పీల్చి పిప్పి చేసినా గ్రహించని దళితులు మొన్న జరిగిన ఎలక్షన్ సమ యం లో తుంగతుర్తి కి పట్టిన దరిద్రుడివి అని తెలుసుకొని తరిమికొట్టిన సిగ్గురాని నీవు ఈరోజు నల్లగొండ జిల్లా దళితుల దరుద్రునిగా మార టానికి కంకణం కట్టుకొని నల్లగొండ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని పై అనుచిత వ్యాఖ్యలు (Inappropriate comments) చేయడం సరికాదు.

మంత్రి కి దళితుల పట్ల, ప్రేమ, ఆప్యాయత, మంచితనం, దళితులకు సాయం చేసే గుణం ఆపదలో ఉన్న దళితుల ను ఆదు కోవడం మంత్రి దళితులకు చేసే సేవ లు చూసి ఓర్వలేక దళితులకు మంత్రిని దూరం చేసే తోరణంలో నోటికి వచ్చిన మాటలతో దూషిం చడం సరికాదు. బిడ్డ ఖబర్దార్ (Khabardar) నీ నోరు ఇకనుండి అయిన అదుపు లో పెట్టుకో లేదంటే దళితులం దరూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాల నాయకులు విద్యార్థి సంఘాల నాయకులు అందరూ కలిసి నిన్ను తరిమికొట్టే సమయం ఆసన్నమైనది బిడ్డ కిషోర్ తస్మాత్ జాగ్రత్త ఇలాంటి అనుచిత వ్యాకలు మానేసి మంత్రి కి బహిరంగ క్షమా పణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పెరిక ఆంజనేయులు అధికార ప్రతిని ధి ,బోడ ప్రభాకర్ జిల్లా ఉపాధ్యక్షు లు, పెరిక హరిప్రసాద్ జిల్లా ఉపా ధ్యక్షులు ,బోగరి రామకృష్ణ జిల్లా సెక్రెటరీ ,మేడి శ్రీను జిల్లా ట్రెజరీ, నల్లగొండ పట్టణ అధ్యక్షులు చిరు మర్తి శ్రీను , జనరల్ సెక్రెటరీ రెడ పాక విజయ్, వడ్డేపల్లి యేసు, ఉపాధ్యక్షులు కంబలి కృష్ణ కనగల్ మండలం అధ్యక్షులు పందుల రాజు ఉపాధ్యక్షులు ఆదిమల్ల సైదులు తదితరులు పాల్గొన్నారు.