Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

SFI: ఏకశీలా పాఠశాలను తక్షణం సీజ్ చేయాలి

— ఎస్ఎఫ్ఐ డిమాండ్

— పాఠశాలలో అమ్ముతున్న పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్, యూనిఫామ్స్, టై, బెల్ట్, స్టేషనరీ..

–విద్యను అంగడిలో సరుకుగా మారుస్తున్న కార్పొరేట్ సంస్థలు

–ఎజెంట్ లుగా మారిన జిల్లా విద్యాశాఖ అధికారులు

–ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఖమ్మంపాటి శంకర్

–పర్యావేక్షణ లో జిల్లా విద్యాశాఖాధికారులు విఫలమయ్యారని విమర్శ

ప్రజాదీవెన నల్గొండ:
SFI: కార్పొరేట్ విద్యాసంస్థలు విద్యను అంగడి సరుకుగా మారుస్తున్నాయని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆకారపు నరేష్ కంభంపాటి శంకర్ లు ఆరోపించారు. ప్రైవేటు పాఠశాలల్లో నిబంధనలకు విరుద్ధంగా పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్, యూనిఫామ్స్, టై, బెల్ట్, స్టేషనరీ జిల్లా విద్యాశాఖ అధికారులు చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని తిరుమల నగర్ రోడ్డు నెంబర్ 1లోఉన్న ఏకశీల పాఠశాల ఆవరణలో పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్, యూనిఫామ్స్, టై, బెల్ట్, స్టేషనరీ అమ్ముతుండగా ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలే కాకుండా ఆఖరికి విద్యార్థులు కాళ్ళ కు వేసుకొనే ‌షూ, సాక్స్ కూడా విక్రయించడం దారుణమన్నారు. ఇంత జరుగుతున్న జిల్లా విద్యాశాఖ అధికారులు తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తక్షణమే ఏకశిలా స్కూల్ ను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు.

డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్ మాట్లాడుతూ నల్లగొండ పట్టణ కేంద్రంలో కార్పొరేట్ ముసుగులో వచ్చి విద్యార్థుల తల్లిదండ్రుల రక్తాన్ని తాగుతూ ఏసీ క్యాంపస్ ల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి లక్షలాది రూపాయల ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. కేవలం యూకేజీకి 82 వేల రూపాయల ఫీజు, పాఠ్యపుస్తకాలకు 9 వేల రూపాయలు వసూలు చేస్తుంటే విద్యాశాఖ అధికారులు నిమ్మకు నిరెత్రినట్టు వ్యవహరిస్తూ కార్పొరేట్ పాఠశాలలకు కొమ్ము కాస్తున్నారని మండిపడ్డారు.

పాఠశాల ఆవరణలో పాఠ్య పుస్తకాలు అమ్మ వద్దని ప్రభుత్వ నిబంధనలు వున్నా వాటిని తుంగలో తొక్కి విద్యను అంగడిలో సరుకుగా మార్చుతూ పేద, మధ్యతరగతి విద్యార్థులను చదువుకు దూరం చేస్తున్న కార్పొరేట్ పాఠశాలలపై జిల్లా కలెక్టర్ తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తిరుమల నగర్ లో ఉన్న ఏకశిల పాఠశాలకు సీబీఎస్ఈ అనుమతి లేకుండా సీబీఎస్ఈ పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తూ లక్షల రూపాయల ఫీజులు దండుకుంటున్న తిరుమల నగర్ ఏకశిలా పాఠశాలను తక్షణమే సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ప్రత్యక్ష అందోళనలకు పూనుకుంటామని హెచ్చరించారు.

నల్గొండ పట్టణ కేంద్రంలో కొన్ని ప్రభుత్వ అనుమతులు లేకుండా విద్యార్థులను మోసం చేస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న కొన్ని ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు ఆగడాలను అరికట్టాలని డిమాండ్ చేశారు. పాఠశాల ఆవరణలో పాఠ్యపుస్తకాలు అమ్మితే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నల్గొండ డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు ఎం.ఏ సైఫ్, మారుపాక కిరణ్, డివైఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు మహేష్ తదితరులు పాల్గొన్నారు.