–అక్రమ గంజాయిని విక్రయిస్తున్న నలుగురు నిందితుల అరెస్ట్
–మీడియా సమావేశంలో నల్లగొండ డి.ఎస్.పి కే శివ రాం రెడ్డి
Siva Ram Reddy: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ లో డ్రగ్స్ నిర్మూలన నిమిత్తం, ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తు, తెలంగాణ రా ష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చ డానికి ప్రత్యేక చర్యలు చేపట్టిం ది. అందులో బాగంగా నల్లగొండ జిల్లాలో ఎస్పి శరత్ చంద్ర పవార్ (SP Sarath Chandra Pawar), నల్లగొండ జిల్లా ను డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చడం కొరకు మిషన్ పరివర్తన్ (Mission Transition)ను తీసుకు రావడం జరిగినది, ఇందులో భాగంగా యస్. పి ఆదేశాల మేరకు డీస్పీ నల్గొండ పర్యవేక్షణలో 31వ తేదీన నల్గొండ నుండి కనగల్ వెళ్ళే దారిలో వేద ఫంక్షన్ హాల్, దర్వేశి పురం గ్రామం వద్ద నలుగురు వ్యక్తు లు గంజాయి అమ్ముచున్నారన్న నమ్మదగిన సమాచారం మేరకు, కనగల్ యస్.ఐ బి. రామక్రిష్ణతో పాటు వారి సిబ్బంది తో వేద పంక్షన్ హాల్ వద్దకు వెళ్ళగా అక్కడ (4) మంది వ్యక్తులు ఒక మోటార్ సైకిల్ తో పంక్షన్ హాల్ వద్ద గంజాయి పాకె ట్ తో కూర్చొని ఉండగా అరెస్టు చేయడం జరిగింది.
సంవత్సర కాలం నుండి ఇట్టి గంజాయి వ్యాపారం (Cannabis business) చేస్తున్నామని, ఇట్టి గంజాయిని విశాక పట్నం లోని గుర్తు తెలియని వ్యక్తుల నుండి కొనుగోలు చేసి, కనగల్ మరియు చుట్టు ప్రక్కల గ్రామాలలో అవసరమైన వ్యక్తులకు, లేబర్లకు, యువకులకు విద్యార్థులకు చిన్న చిన్న పోట్లాలుగా 50 gr మరియు 100 gr గా చేసి 200 రూ. మరియు 500 రూ. లకు గాను అమ్ముతున్నారు ఇందులో భాగముగా 20 మంది భాదితులను గుర్తించి వారికి కౌన్సిలింగ్ చేయనయినది. మిషన్ పరివర్తన లో బాగంగా జిల్లా పోలీసు కార్యా లయo (Police work)లో గంజాయి పోలీస్ కంట్రో ల్ రూమ్ ను ఏర్పాటు చేయడం జరిగినధి. దీని లో భాగంగా ఫోన్ నం. 8712670266 ను అందుబా టు లోకి తేవడం జరిగినది, జిల్లా ప్రజలు ఎవరైనా ఇట్టి నెంబర్ కు ఫోన్ చేసి గంజాయి కి సంబంధిం చిన సమాచారం ఇవ్వవచ్చును. వారి వివరాలు గోప్యంగా ఉంచబ డును. ఇట్టి గంజాయికేసును ఛేదించిన నల్లగొండ డియస్పి కె.శివ రాం రెడ్డి పర్యవేక్షణలో బాగంగా, చండూర్ సి.ఐ ఎ. వెంకటయ్య ఆధ్వర్యంలో, కనగల్ యస్.ఐ., బి. రామక్రిష్ణ, వారి సిబ్బంది రమేశ్, సురేష్, రైటర్ రమేష్, వెంకన్న, వీరయ్య, సర్ఫరాజ్ ఖాన్, వెంకట్ రెడ్డి, జానయ్య లను జిల్లా యస్.పి అభినందించారు.