— నగదు రెట్టింపు చేస్తామని మోసం చేసే ముఠా ఆటకట్టు
–24 గంటలలో నిందితులను పట్టు కున్న నల్లగొండ జిల్లా పోలీసులు
–మీడియా సమావేశంలో నల్లగొం డ జిల్లా యస్పీ శరత్ చంద్ర పవార్ వెల్లడి
SP Sarath Chandra Pawar: ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లా నల్లగొండ మండలలోని చంద నపల్లి గ్రామంలో ఒరిజినల్ రూ.50 0 రూపాయల కరెన్సీ నోటులకు మద్యలో తెల్ల కాగితాలను పెట్టడం ద్వారా బాదితులను మోసం చేస్తు న్న మోసకారి ముఠా పోలీసుల (police)చేతికి చిక్కింది. అసలు నోట్ల మధ్య లో నోటు సైజులోని తెల్ల కాగితం పెట్టీ అసలు కరెన్సీతో పారిపోతూ మోసం చేస్తున్న కొందరి సభ్యుల ముఠా ను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు కు (arrest) సంబందించిన వివరాలు నల్లగొండ జిల్లా ఎస్పీ శర త్ చంద్ర పవార్ మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావే శంలో వెల్లడించారు.ఈ నెల 22వ తేదీన నల్లగొండ మండ లంలోని చందనపల్లి గ్రామంలో ఆర్ ఎంపి డాక్టర్ శ్రీరామోజు రామాచారి వద్ద నుండి రూ. 33 లక్షల నగదు ను రెట్టింపు చేస్తాం అని చెప్పి మో సం చేసి అసలు నగదుతో పారి పోయారు. ఈ విషయములో ఫిర్యాదు అందుకున్న పోలీసులు నల్లగొండ డిఎస్పిశివరాం రెడ్డి (DSP Sivaram Reddy)పర్యవేక్షణలో టౌన్ సర్కిల్ ఇన్స్పె క్టర్ డానియెల్ కుమార్ ఆధ్వర్యం లో నల్గొండ రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ శివకుమార్, కానిస్టేబుల్ తి రుమలేష్, కానిస్టేబుల్ లు జానకి రాములు లు మోసపూరిత నేరానికి పాల్పడిన ముగ్గురిలో ఇద్దరినీ అరె స్టు చేసి వారి వద్ధ నుండి రూ.24 లక్షలు స్వాధీనము చేసుకోగా మూడవ వ్యక్తి పరారీలో ఉన్నాడు.
నేరానికి పాల్పడిన ముగ్గురిలో బీహార్ రాష్ట్రానికి చెందిన షేక్ శిరాజ్(53 ), రాం నరేష్ యాద వ్( 40), పరారీలో ఉన్న షేక్ అఫ్తాబ్ గా గుర్తించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వీరి వద్ద నుంచి రూ. 24 లక్షల నగదు, 3 సెల్ ఫోన్ లు, నోట్లను తయారు చేస్తానని మోసం చేయుటకు ఉప యోగించిన రంగు కలర్ సీసాలతో పాటు ఇతర సామగ్రి తెల్లని కాగితా లు కలిగిన నోట్ల కట్ట లు స్వాధీనం చేసుకున్నారు. బీహార్ రాష్ట్రానికి చెందిన రామ్ నరేష్ యాదవ్ గతంలో నల్గొండ (nalgonda) మండలం చందనపల్లి గ్రామంలో తాపీ మేస్త్రి గా పని చేసినాడు. ఆ సమయంలో చందనపల్లి గ్రామానికి చెందిన ఆర్ ఎంపీ డాక్టర్ అయిన శ్రీ రామోజు రామాచారి ఇల్లును కట్టడం జరి గింది. ఈ నెల 22వ తేదీన సుమా రు ఉదయం 11 గంటల సమయం లో సదరు రామ్ నరేష్ యాదవ్ బీహార్ రాష్ట్రానికి చెందిన అతని స్నేహితుడు షేక్ సిరాజ్ తో కలిసి చందనపల్లి గ్రామంలోని ఆర్ఎంపీ డాక్టర్ శ్రీరామోజు రామాచారి ఇంటి కి వెళ్లి వారి దగ్గర డబ్బులను రెట్టిం పు చేసే లిక్విడ్ ఉన్నదని మీ దగ్గర ఏమైనా డబ్బులు ఉన్నచో వాటిని రెట్టింపు చేసి ఇస్తామని ఆశ చూపిం చి నమ్మించగా వారి మాటలను నమ్మిన చారి, అతని బావమరిది బై రోజు అమరేంద్రచారి లు ఇద్దరూ రామాచారి వాళ్ళ ఇంట్లో మొదటి ఫ్లోర్ కి తీసుకెళ్లి, రామాచారి భూమి ని కొనుగోలు చేయడానికి తెచ్చిన రూ. 33 లక్షల నగదును వారికి చూపించగా వారి వెంట తెచ్చుకున్న లిక్విడ్ ని ఒక బకెట్లో పోసి 50 వేల రూపాయల కట్టలను ఆరింటిని మూడు లక్షల రూపాయలను ఒకసారి లిక్విడ్ లో ముంచి బయటకు తీసి, వాటికి వారి వద్ద ఉన్న తెలుపు మరియు బ్రౌన్ కలర్ ప్లాస్టర్లు వేసి ఒక బండల్ గా చేశారు.
అలా మరొక మూడు లక్షల రూపాయలను లిక్విడ్ లో ముంచి వాటికి కూడా ప్లాస్టర్లు వేసి బండె లుగా చేయడం అనంతరం అలా మూడు లక్షల రూపాయల ఒక కట్ట చొప్పున మొత్తం రూ. 33 లక్షలను 11 కట్టలు కట్టి, అట్టి కట్టలలో మూ డు కట్టలను ఒక పెద్ద బండెలుగా తయారుచేసి, అలా 3 బండెలు చేసి వారు తెచ్చిన లిక్విడ్ లో ముం చినారు.ఒక గంట తర్వాత వాటిని స్టవ్ పై వేడిచేసి ఒక రోజు తర్వాత ఓపెన్ చేస్తే అట్టి డబ్బులు రెట్టింపు అవుతాయని చెప్పి వాటికి హైదరా బాద్ కు వెళ్లి లేబుల్స్ కొనుక్కొస్తా మని చెప్పినారు. అంతలో రామా చారి బావమరిది అమరేంద్ర చారి తన ఇంటికి వెళ్ళగా, పేషెంట్ వచ్చి నాడని రామాచారి మొదటి ఫ్లోర్ నుండి కిందికి దిగినాడు. ఆ సమ యంలో నేరస్తులు ఇద్దరు అప్పటికే వారి వెంట బ్యాగులో ఒక కట్టకి పైన ఒకటి కింద ఒకటి ఒరిజినల్ రూ. 500ల నోట్లు పెట్టి మధ్యలో తెల్లటి కాగితాలను పెట్టి ప్యాక్ చేసి ఉంచి న డబ్బు కట్టలను నిజమైన కట్టల స్థానంలో ఉంచి వాటిని నేరస్తుల బ్యాగుల లో పెట్టుకొని హైదరాబాద్ కు వెళ్లి లేబుల్స్ తీసుకుని ఉదయం వస్తామని చెప్పి వెళ్ళిపోగా సదరు ఫిర్యాదుతో టీమ్ గా ఏర్పడి నేర స్తుల ఆచూకీ గురుంచి వెతుకుతుం డగా నల్గొండ రైల్వే స్టేషన్ (Nalgonda Railway Station) లో బిహా ర్ పారిపోవుటకు అనుమానాస్ప దంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తు లను ఆపి వారి వద్ద ఉన్న బ్యాగ్ ను చెక్ చేయగా, డబ్బుల కట్టలు కనిపించినవి. వెంటనే వారి ఇద్దరినీ అదుపులోకి తీసుకొని విచారించి వారి వద్ద ఉన్న రూ. 24 లక్షల నగ దు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఉన్న మూడవ వ్యక్తి అయి న షేక్ ఆఫ్తాబ్ రూ. 9 లక్షల నగదు తో పరారీలో ఉన్నాడు. త్వరలోనే అతనిని అరెస్టు చేస్తామని చెప్పా రు. కేసు విచారణ నల్లగొండ డిఎస్పి శివరాం రెడ్డి పర్యవేక్ష ణలో నల్గొండ టు టౌన్ సర్కల్ ఇన్స్పెక్టర్ డానియల్ కుమార్, నల్గొండ రూరల్ ఎస్ఐ శివ కుమార్, కానిస్టేబుల్ తిరుమలేష్, జానకి రాములు, హోం గార్డ్ (Home Guard)సలీం చాకచక్యంగా వ్యవహరించి నేరస్తులని పట్టుకొని అరెస్టు చేశారు. కేసు ను త్వరితగతిన చేదిచినందుకు ఎస్పి శరత్ చంద్ర పవార్ (SP Sarath Chandra Pawar) ఐపిఎస్ విచారణ బృందాన్ని అభినందించారు.