–జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్
SP Sarath Chandra Pawar: ప్రజా దీవెన నల్లగొండ: మహిళను హత్య చేసిన కేసులో నిందితుడు మూజవర్ నూర్ మహమ్మద్ కి రెండవ అడిషనల్ కోర్టు జడ్జి ఎస్సి, ఎస్టి కోర్టు న్యాయమూర్తి రోజా రమణి జీవిత ఖైదు విధించినట్లు జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్ తెలిపారు. వివరాలలోకి ఇలా ఉన్నాయి. గురువారం కనగల్ మం డల పరిధిలోని పర్వతగిరి గ్రామ శివారులో ఒక కల్లు గుడిసెలో గుర్తు తెలియని మహిళ హత్యకు గుర య్యారు. గ్రామ పంచాయతీ విఆర్ ఓ ఇచ్చిన పిర్యాదు మేరకు కనగల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసు కొని దర్యాఫ్తు నిర్వహించగా మృ తురాలు చివ్వెంల మండలం వస్రం తండాకు చెందిన భూక్యా విజయ భర్తను వదిలి ఒంటరిగా జీవనం సాగిస్తున్నది.మృతురాలికి ఒక బాబు ,కూతురు ఉండగా నిందితు డైన కర్నూలు జిల్లాకి చెందిన ముజవార్ నూర్ మహమ్మద్ అనే వ్యక్తి కేబుల్ ఆపరేటర్ గా సూర్యా పేటలో పని చేస్తున్న క్రమంలో మృ తురాలు పరిచయం ఏర్పడి గత కొంత కాలంగా సహజీవనం చేస్తోం ది.
మృతురాలికి వేరే వాళ్ళతో అక్ర మ సంబంధం ఉందని అనుమానం తో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఎలాగైనా మృతురాలి చం పాలని నిర్ణయించుకొని పథకం ప్రకా రంగా మృతురాలి కూతురైన కల్యాణికి దేవరకొండ నందు ఎస్సి ఎస్సీ గురుకుల పాఠశాలల్లో సీటు మాట్లాడాదమని తన బైక్ పైన ఎక్కించుకొని దేవరకొండ తీసుకేళ్లి తిరిగి వచ్చే క్రమంలో కనగల్ మం డల పరిదిలోని పర్వతగిరి గ్రామ శివారులో కల్లు గుడిసెలో ఆగి మ ద్యం తాగించి మతిస్థిమితం కోల్పో యిందని గుర్తించి తలపై బండ రాయితో మోది హత్య చేసి ఎవరు గుర్తుపట్టకుండా పెట్రోల్ పోసి తగల పెట్టి పారిపోయాడు.
ఈ కేసులో ఈ రోజు యస్.సి యస్.టి కోర్టు న్యాయమూర్తి రోజా రమణి విచా రణ జరిపి నిందితుడైన ముజావర్ నూర్ మహమ్మద్ కి జీవిత ఖైది విధించినట్లు జిల్లా ఎస్పి తెలిపారు. ఈ కేసులో సరైన ఆధారాలు కోర్టు లో సమర్పించిన అప్పటి ఇన్వెస్టిగే షన్ ఆఫీసర్ డీఎస్పీ రాములు నాయక్, సిఐ సుబ్బ రాం రెడ్డి,పి.పి అఖిల, ఇప్పటి సిఐ వెంకటయ్య యస్.ఐ విష్ణు మూర్తి,కోర్టు కానిస్టే బుల్ నగేష్, లైజనింగ్ ఆఫీసర్ నరేందర్,మల్లికార్జున్ గార్లని జిల్లా ఎస్పి అభినందించారు.అలాగే ఇటీ వల జంట హత్య కేసులో నిందితు లకు సరైన ఆధారాలు కోర్టులో సమర్పించి నిదితునికి జీవిత ఖైది విధించినందుకు అప్పటి ఇన్వెస్టి గేషన్ ఆఫీసర్ సిఐ సుబ్బ రాంరెడ్డి ని జిల్లా ఎస్పి అభినందించారు.