**సైబర్ నేరాల నుండి అప్రమత్తంగా ఉండాలి
SP Sarath Chandra Pawar: ప్రజాదీవెన, నల్గొండ టౌన్ :సైబర్ నేరగాళ్ళు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ /పెట్టుబడి పేరుతో మీతో పలు యాప్లు డౌన్లోడ్ చేయించి మిమ్మలను ప్రలోభ పెట్టీ మీ బ్యాంకు అకౌంట్ నుండి సర్వం దోచేస్తారు, జాగ్రత్త. ఈలాంటి సంఘటన నల్గొండ 1టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఈ కేసు లో ఒక బాధితుడుకి సుమారు 2 కోట్ల రూపాయలు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయించి నకిలి అధిక లాభాన్ని చూపి సైబర్ నేరగాళ్లు మోసగించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము.
కావున ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని, సైబర్ నేరగాళ్లు సోషల్ మీడియా ను ఆసరాగా చేసుకుని చెప్పే మాటలు మరియు పంపే మెసేజ్ లు నమ్మి మోసపోవద్దని, సంఘటన జరిగిన వెంటనే సైబర్ నేరాల పై 1930 కి కాల్ చేయడం లేదా https://www.cybercrime.gov.in/ వెబ్సైట్ లో నమోదు చేయడం లేదా మీ దగ్గర్లో ఉన్న పోలీస్ స్టేషన్ కి వెళ్లి రిపోర్ట్ ఇవ్వాలని జిల్లా ఎస్పి చూచించారు .