–అధిక రాబడికి ఆశపడి మోసపో వద్దు
–సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి
–నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్
SP Sarath Chandra Pawar:ప్రజా దీవెన, నల్లగొండ: నకిలీ స్టాక్ మార్కెట్ యాప్ లో (Fake stock market app) పెట్టుబడి పెట్టి అధిక రాబడికి ఆశపడి మోస పోవద్దని జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్ (SP Sarath Chandra Pawar)ఆదివారం తెలిపారు. ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ అధిక రాబడుల వాగ్దానాలతో మోసగాళ్లు సోషల్ మీడియా ద్వారా బాధితులను ఆక ర్షిస్తున్నారని, జెఫరీస్ ఎంటర్పెస్,సా క్లిసింగ్ మోతీలాల్ ట్రేడ్ వంటి నకిలీ మొబైల్ యాప్ (fake mobile app)ద్వార ఎవరైనా వేరు వేరు బ్యాంక్ ఎకౌంట్స్ లలో డబ్బులు వేయించుకొని, నమ్మించి వాట్సాప్ (whatsapp)ద్వార పరిచయమై అధిక మొత్తంలో పెట్టుబడి పెట్టాలని వాట్సాప్ కాల్ ద్వార మాట్లా డు తూ, వాట్సాప్ గ్రూప్లు క్రియేట్ చేసి నమ్మించి పెట్టుబడి పెట్టేలచేసి, అధిక లాభాన్ని చూపించి డబ్బులు పెట్టిన తరువాత వాటిని విత్ డ్రాకు అవకాశం ఇవ్వకుండా మోసాలకు పాల్పడుతున్నారన్నారు.
ఇటు వంటి మోసపూరిత నకిలీ స్టాక్ మార్కెట్ యాప్ పై (Fake stock market app) అప్రమత్తంగా వుండాలని, ఇలాంటి ఒక సంఘ టనపై ఒక బాడితుడు కంప్లెంట్ చేయగా కేతేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదు (case) చేయటం జరిగిందని, దీనిలో భాదితుడు ఎక్కువ లాభాలు ఆశించి పైన తెల్పిన జెఫరీస్ ఎంటర్పెస్, సాక్షిసింగ్ మోతీలాల్ ట్రేడ్ వంటి నకిలీ మొబైల్ యాప్ లో సుమారు పద కొండు లక్షలు వరకు పెట్టుబడి పెట్టి మోసపోయాడని,నల్లగొండ జిల్లా ప్రజలు ఇలాంటి సంఘటనలు ముందుగానే గుర్తించి నకిలీ స్టాక్ మార్కెట్ యాప్ వైపు ఆకర్షిం చ వద్దని, అట్టి వారిని ముందుగానే గుర్తించి వారి కాల్స్ ను బ్లాక్ చేయ డం మంచిదన్నారు. సైబర్ నేర గాళ్లు చెప్పిన మాటలు ఎట్టి పరి స్థితుల్లో నమ్మ కూడదని, ఒకవేళ ఎవరైనా ఇలాంటి మోసాలకు గు రైతే వెంటెనే సైబర్ హెల్ప్ లైన్ నంబర్ 1930 కి కాల్ చేసి తెలి యజేయాలని, లేదా మీకు అందుబా టులో వున్న పోలీస్ స్టేషన్ లో కంప్లెంట్ చేసి సైబర్ క్రైమ్ (Cybercrime)పోలీసులను సంప్రదించాలనీ సూచించారు.