–నల్లగొండ జిల్లా కలెక్టర్ నారాయ ణ రెడ్డి, ఎస్పీ శరత్ చంద్ర పవార్
SP Sarath Chandra Pawar: ప్రజా దీవెన నల్లగొండ: జిల్లా ప్రజలు సుఖ ,సంతోషాలతో వినాయక ఉత్సవాలను నిర్వహిం చుకోవాలని జిల్లా కలెక్టర్ సి.నా రాయణరెడ్డి (narayana reddy) పిలుపుని చ్చారు. వినాయక చవితి (Lord Vinayaka) సందర్భంగా శనివారం ఆయన నల్గొండ జిల్లా కేంద్రంలోని రామగిరి రామాలయం వద్ద ఏర్పాటుచేసిన వినాయక మండపాన్ని సందర్శించి వినా యకునికి ప్రత్యేక పూజలు నిర్వ హించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ (Collector) మాట్లాడుతూ జిల్లాలో వినాయక ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘ టనలు జరగకుండా అందరూ సుఖ సంతోషాలతో ఉత్సవాలు జరుపు కోవాలని ఇందుకు వినాయక మండపాల నిర్వా హకులు మం డపాల సమాచారాన్ని పోలీసులకు అందజేయా లని, మున్సిపాలిటీ లు, గ్రామపంచా యతీలలో చవి తికు పారిశుధ్య సమస్యలు తలెత్త కుండా పారిశుధ్య కార్యక్రమాలను ముమ్మరంగా నిర్వహించాలని, విద్యుత్ విషయంలో సైతం మండప నిర్వహకులు పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
నిమజ్జనం జరిగే దగ్గర అన్ని ఏర్పాటు చేయాలని ఇది వరకే అధికారుల ను, సిబ్బందిని ఆదేశించామని, బారికేడ్లు, క్రేన్ల ఏర్పాటు గజ ఈతగాళ్లు, లైటింగ్, వైద్య సదుపాయాల వంటివి ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. వినాయకుని ఆశీస్సులు జిల్లా ప్రజలపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు.జిల్లా ఎస్పీ శరథ్ చంద్ర పవార్ , ఆర్డిఓ రవి, డిఎస్పి శివరాంరెడ్డి, తహసిల్దార్ శ్రీనివాస్, రామగిరి రామాలయం మండప నిర్వాహకులు, తదితరులు ఉన్నారు.