Swami Vivekananda : ప్రజాదీవెన, నల్గొండ టౌన్ : స్వామి జయంతిని స్థానిక హైదరాబాద్ రోడ్డులో నల్లగొండ నందు స్వామి వివేకానంద విగ్రహం వద్ద తపస్ అధ్యక్షులు ఇరుగు శ్రీరామ్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించడం జరిగింది .ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ఇరుగు శ్రీరామ్ మాట్లాడుతూ విద్యార్థుల్లో, ఉపాధ్యాయుల్లో వివేకానంద బోధనలు ఆశయాలను పెంపొందించేందుకు కృషి చేస్తుందని తెలిపారు . ప్రధాన వక్తగా విచ్చేసిన ఆర్ఎస్ఎస్ విభాగ్ శారీరక్ ప్రముక్ బీ. కన్నయ్య మాట్లాడుతూ స్వామి వివేకానంద అమెరికాలోని చికాగోలో చేసిన ప్రసంగం ప్రపంచం నలుమూలల హిందూ ధర్మ , సనాతన ధర్మం యొక్క విశిష్టతను ప్రపంచానికి చాటి చెప్పాడు అన్నారు. ఆయన భావజాలాన్ని అనుసరించాలని, అందరూ ఆయన అడుగుజాడల్లో నడవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ శ్రీనివాసరెడ్డి మరియువైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ ,ఆర్డీవో అశోక్ రెడ్డి, ఎమ్మార్వో శ్రీనివాసులు,రాష్ట్ర ప్రశిక్షణ కో కన్వీనర్ గుర్రం ప్రభాకర్ రెడ్డి ,జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తిని భాస్కర్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు గోపాల్ రెడ్డి, కోశాధికారి నంద్యాల నర్సిరెడ్డి ,రేణిగుంట్ల రాజశేఖర్ మురళి ,శ్రీనివాస్ ,వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సమావేశ అనంతరం వివిధ పాఠశాలలో నిర్వహించిన వక్తృత్వ పోటీలలో గెలుపొందిన విద్యార్థిని, విద్యార్థులకు ఆర్డీవో, ఎంఆర్ఓ చేతుల మీదుగా బహుమతులు అందజేయడం జరిగింది.