ప్రజా దీవెన, నల్లగొండ టౌన్:
Tailoring Training Classes: యువ పరివర్తన ఫౌండేషన్ సహకారంతో శనివారం గుండ్లపల్లి గ్రామంలో టైలరింగ్ శిక్షణ తరగతులు మాజీ జడ్పిటిసి వంగూరి లక్ష్మయ్య చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టైలరింగ్ శిక్షణ తరగతులు ప్రతి మహిళ కూడా వినియోగించుకుని వారి ఆర్థిక పురోగతిని మెరుగుపరుచుకోవాలని అన్నారు.
ఫౌండేషన్ ఏరియా మేనేజర్ మునేష్ మాట్లాడుతూ.. మహిళలకు టైలరింగ్ శిక్షణ వారికి స్వయం ఉపాధి కల్పిస్తుందని అలాగే ఫౌండేషన్ యువతకు మరియు మహిళలకు చక్కటి అవకాశాలు కల్పిస్తుందని తెలిపారు. ఈ అవకాశాలన్నీ అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీశైలం, కావ్య శ్రీ , అరుంధతి, శ్రీదేవి తదితర మహిళా సంఘాలు పాల్గొన్నారు.