–నల్లగొండ జిల్లా ఐటిఐ కన్వీనర్ ప్రిన్సిపాల్ ఏ.నరసింహ చారి
Telangana ITI Admission 2024: :ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: ప్రస్తుత విద్యా సంవత్సరానికి ఐటిఐలలో (iti) అడ్మిషన్ కొరకు రెండవ విడత అడ్మిషన్ పొడిగింపు నోటిఫి కేషన్ (notifications)జారీ చేసినట్టు నల్లగొండ జిల్లా ఐటిఐ కన్వీనర్ ప్రిన్సిపాల్ ఏ నరసింహ చారి ఒక ప్రకటనలో తెలిపారు. నల్లగొండ జిల్లాలోని ప్రభుత్వం నాలుగు మరియు ప్రైవేట్ 10 ఐటిఐలలో 2024 — 2025 మరియు 2026 సంవత్సరం ఒకటి మరియు రెండు సంవత్సరాల కోచింగ్ లకు అడ్మిషను కొరకు రెండవ విడత దరఖాస్తుల స్వీకరణ ఆన్లైన్లో ఆన్లైన్ అప్లోడ్ చేసుకునే అవకాశాన్ని ఈ నెల జులై 21 వరకు పొడిగించారు కావున అభ్యర్థులు వారి ఒరిజినల్ సర్టిఫికెట్లను ఎస్ ఎస్ సి, కుల ధ్రువీకరణ, బోనఫర్డ్ స్టడీ కనీసం ఒకటి నుండి 7వ తరగతి వరకు తెలంగాణలో చదివి ఉంటే వారికి స్థానిక అభ్యర్థులుగా పరిగణిస్తారు ఆన్లైన్లో మీ ఫోటోతో సహస్కాన్ చేసి ఆన్ లోడ్ చేయాలి.
ఇందుకు గాను http:/iti.telangana.gov.inఅనే వెబ్స్తటు నందు మొబైల్ నెంబర్ (Mobile no)తో రిజిస్టర్ చేసుకొని మీ సొంత ఫోన్ నెంబర్ వాడుట మంచిది. ఎందుకంటే ఆ తర్వాత మీ అడ్మిషన్ (Admission) కు సంబంధించిన ఉత్తర ప్రత్యుత్తరాలు చిన్న సమాచారం ద్వారా ఎస్ఎంఎస్ తెలియపరుస్తారు. కనుక తెలంగాణలోనే ఏ గవర్నమెంట్ మరియు ప్రైవేట్ ఐటిఐ లలో ఒకే ఒక్క రిజిస్ట్రేషన్ తో అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే మీకు నచ్చిన ట్రేడ్ కూడా ప్రాధాన్యత ఆధారంగా ఎక్కువగా అప్షన్స్ ఎంచుకోగలరు. విద్యార్థిని, విద్యార్థులు ఈ అవకాశాన్ని నద్వినియోగం చేసుకోవాలని నల్లగొండ జిల్లా ఐటిఐ ల కన్వీనర్ ప్రిన్సిపాల్ ఏ నరసింహ చారి (Narasimha Chari) తెలిపారు.