Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Thummala Veera Reddy: ప్రజలకిచ్చిన హామీలన్నీ అమలు చేయాలి

–సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి

ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: లాటరీ ద్వారా ఎంపికైన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారులకు వెంటనే స్వాధీనపరచాలని సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి రాష్ట్ర కమిటీ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం సిపిఎం నల్గొండ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేసి తాసిల్దార్ శ్రీనివాస్ కు వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2017లో నిర్మాణం చేసిన డబల్ బెడ్ రూమ్ ఇండ్లు మౌలిక సదుపాయాలు కల్పించకుండా శిథిలావస్థకు చేరాయని అన్నారు. గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఇండ్ల లేని పేదల ద్వారా దరఖాస్తులు స్వీకరించి పరిశీలించి అర్హుల జాబితా రూపొందించి అందులో నుండి వీడియో కెమెరాలలో లాటరీ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగిందని అన్నారు. వారికి వెంటనే స్వాధీనపరచకుండా కాలయాపన చేయడం సరికాదన్నారు.

కిరాయి ఇండ్లలో నివాసం ఉంటూ ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వీరికి ప్రభుత్వం వెంటనే మౌలిక సదుపాయాలు కల్పించి స్వాధీన పరచాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్థలం ఉన్న పేదవారికి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇస్తామని తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూనే గత ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు శిథిలావస్థకు చేరకుండా పేదలకు స్వాధీనపరిచి ప్రజాధనం దుర్వినియోగం కాకుండా కాపాడవలసిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం పై ఉందని అన్నారు. మౌలిక సదుపాయాల కు కావలసిన నిధులను కేటాయించి పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. జనవరి 26 నాటికి లబ్ధిదారులకు స్వాధీరపరిచే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని లేనియెడల సిపిఎం ఆధ్వర్యంలో ఫిబ్రవరి మొదటి వారంలో లాటరీ ద్వారా ఎంపికైన లబ్ధిదారులకు మేమే స్వాధీనం చేయిస్తామని హెచ్చరించారు.

అనంతరం డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల సాధన పోరాట కమిటీ కన్వీనర్ గా సీపీఎం పట్టణ నాయకులు, మాజీ కౌన్సిలర్ అవుట రవీందర్ తో పాటు 19మంది తో కమిటీ* ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.ధర్నా అనంతరం జరిగిన సభకు సిపిఎం పట్టణ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య అధ్యక్షత వహించగా జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సయ్యద్ హశం, జిల్లా కమిటీ సభ్యులు ఎండి సలీం, పట్టణ కమిటీ సభ్యులు తుమ్మల పద్మ, అద్దంకి నరసింహ, దండంపల్లి సరోజ ,కోట్ల అశోక్ రెడ్డి, గుండాల నరేష్, ఊటుకూరు మధుసూదన్ రెడ్డి, భూతం అరుణ, గంజి నాగరాజు, మారగోని నగేష్ మాజీ కౌన్సిలర్ అవుట రవీందర్ లబ్ధిదారులు లతీఫ్ సుజాత శ్రీనివాస్ జహంగీర్ గణేష్ బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.