— సామాజిక ప్రజా సంఘాల నేతల డిమాండ్
ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: రా జ్యాంగ నిర్మా త అంబేద్కర్ పై కేం ద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన అవమానకర వ్యాఖ్యలపై తక్షణ మే ఆయనను బర్తరఫ్ చేయాలని అతని పై ఎస్సి ఎస్టీ కేసు నమోదు చేయాలని సామాజిక ప్రజాసం ఘాల జిల్లా నాయకులు తుమ్మల వీరారెడ్డి నారి ఐలయ్య పాలడుగు నాగార్జున లు డిమాండ్ చేశారు.శుక్రవారం నల్గొండలోని శుభాష్ విగ్రహం వద్ద అమితాషా దిష్టి బొమ్మ దహనం చేయడం జరిగింది.
అమిత్ షా ఖబడ్దార్ అంబేద్కర్ జిందాబాద్ రాజ్యాంగం వర్ధిల్లాలి అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. సామాజిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ పై అమిత్ షా అహంకారపూరితమైన మరియు తిరస్కార స్వరంతో అమిత్ షా మాట్లాడడం తన అహంకారాన్ని రుజువు చేసిందన్నారు భారతదేశ లౌకిక మరియు ప్రగతిశీల రాజ్యాంగ రూపశిల్పి పైన చూపిన అగౌరవాన్ని, అపహాస్యం చేయడానికి ప్రయత్నించారని విమర్శించారు. ఈ అవమానకరమైన వ్యాఖ్యలకు బాధ్యత వహిస్తూ హోం మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని మరియు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈ వ్యాఖ్యలు కేవలం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ పైన చేసినవి మాత్రమే కాదని,సామాజిక న్యాయం కోసం పోరాటాన్ని కొనసాగిస్తున్న లక్షలాది మంది అణగారిన వ్యక్తులకు జరిగిన అవమానమన్నారు తక్షణమే అతన్ని బర్తరఫ్ చేయాలన్నారు.భారత రాజ్యాంగంపై బీజేపీ చేస్తున్న దాడికి వ్యతిరేకంగా భారత ప్రజల నుంచి పెరుగుతున్న ప్రతిఘటన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారన్నారు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ హిందూత్వ శక్తులచే నిరంతరం దాడికి గురవుతున్న భారత రాజ్యాంగంలో పొందుపరచబడిన నిశ్చయాత్మక చర్యల నిబంధనల పరిరక్షణ కోసం పోరాడటానికి లక్షలాది మందిని ప్రేరేపించారని చెప్పారు భారత ప్రజలపై మనువాద భావజాలాన్ని రుద్దేందుకు ఈ శక్తులు అవిశ్రాంతంగా పనిచేస్తున్నాయని చెప్పారు. అమిత్ షా మరియు బిజెపి పార్టీ వారి ఆలోచనలు కులతత్వంతో ఉన్నాయని, రాజ్యాంగం పట్ల నిజమైన గౌరవం లేదని ఇది మరోసారి రుజువయిందన్నారు.
ఎన్నికల సమయంలోనే కాకుండా ఆర్ఎస్ఎస్/బిజెపి తరచుగా వ్యక్తం చేసే అసహనం, భారతదేశంలో సామాజిక న్యాయం , సమానత్వం కోసం డాక్టర్ అంబేద్కర్ పోరాడి నడిపిన ఉద్యమాలు మరియు ఆదర్శాల పట్ల వారి లోతైన ద్వేషాన్ని వెల్లడిస్తుందన్నారు మతోన్మాదుల నుండి దేశానికి ప్రమాదం పొంచి ఉందని అమిత్ షా విద్వేషాలకు కారకుడని విమర్శించారు. తక్షణమే అమిత్ షా ను బర్తరఫ్ చేయాలని చేసే వరకు ఉద్యమా లను కొనసాగిస్తామని హెచ్చరిం చారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర నాయకులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి బండ శ్రీశైలం, నాయకులు పాలడుగు ప్రభావతి, హశమ్, గంజి మురళి, కృష్ణారె డ్డి,ఎండీ సలీం, దండంపల్లి సత్త య్య,వూట్కూరి నారాయణ రెడ్డి,పోలె సత్యనారాయ ణ,వూట్కూరి మధుసూదనరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.