Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Thummala Veera Reddy: మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేయాలి

Thummala Veera Reddy: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: మున్సిపాలిటీలలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎన్ఎంఆర్ ఫిక్స్డ్ పే డైలీ వేజ్ తదితర పద్ధతుల్లో పనిచేస్తున్న కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి (Thummala Veera Reddy)ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు నల్లగొండ జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించి జాయింట్ కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించడం జరిగింది ఈ సందర్భంగా వీరారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా వివిధ మున్సిపల్ కార్పొరేషన్ లలో సుమారు 65 వేల మంది శానిటేషన్ వాటర్ సప్లై ట్రాక్టర్ డ్రైవర్ ఎలక్ట్రిసిటీ డంపింగ్ యార్డ్స్ పార్కుల (Electricity Dumping Yards Parks)నిర్వహణ తదితర విభాగాలలో పనిచేస్తున్నారని అన్నారు. పర్మినెంట్ కనీస వేతనం రిటైర్మెంట్ బెనిఫిట్స్ లాంటి ప్రభుత్వ సంక్షేమాలు, కార్మికులకు రక్షణ సదుపాయాలు కల్పించడం లేదని అన్నారు .అనేకమంది కార్మికులు పని చేస్తున్న సమయాల్లో ప్రమాదాలు జరిగి మరణిస్తున్నారని, రాత్రిపూట చేసే సమయాల్లో అతివేగంగా వచ్చే వాహనాల కింద పడి ప్రమాదాల్లో మరణిస్తున్నారని అటువంటి వారికి ఎలాంటి నష్టపోయారు చెల్లించడం లేదని అన్నారు ప్రమాదాల్లో మరణిస్తున్న కార్మికులకు 25 లక్షల ఇన్సూరెన్స్ పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.

మున్సిపల్ కార్మికులను (Municipal workers)పర్మినెంట్ చేసేలోపు కనీస వేతనం 26,000 అమలు చేయాలని అన్ని మున్సిపాలిటీలలో ఎనిమిది గంటల పని విధానం వివిధ విభాగాల్లో పనిచేస్తున్న వారి చదువు మరియు వృత్తి నైపుణ్యతను గుర్తించి జవాన్లుగా డ్రైవర్లుగా శానిటరీ ఇన్స్పెక్టర్లుగా కంప్యూటర్ ఆపరేటర్లుగా ప్రమోషన్ కల్పించాలని డిమాండ్ చేశారు రాత్రివేళ డ్యూటీ చేసే కార్మికులకు ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కల్పించాలని రక్షణ చర్యలు చేపట్టాలని కోరారు ప్రతి మున్సిపల్ కేంద్రంలో (Municipal Centre) ఈఎస్ఐ హాస్పిటల్ ఏర్పాటు చేయాలని మున్సిపల్ కార్మికుల వేతనాల నుండి కటింగ్ చేసిన పీఎఫ్ ఈఎస్ఐ డబ్బులు వారి వ్యక్తిగత ఖాతాల్లో జమ చేయని మున్సిపల్ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఆదివారాలు జాతీయ సెలవులు రాష్ట్ర పండుగల సందర్భంగా వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని మున్సిపల్ కార్మికులందరికీ మొదటి ప్రాధాన్యతనిచ్చి డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇండ్లు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

మున్సిపల్ కార్మికుల సమస్యల (Labor issues) పరిష్కారం కోసం ఈ నెల 27 28 తేదీలలో అన్ని మున్సిపాలిటీల ముందు ధర్నా చేసి కమిషనర్లకు వినతి పత్రాలు ఇవ్వాలని అక్టోబర్ 8న హైదరాబాద్ సిడిఎంఏ కార్యాల యం ముందు జరిగే ధర్నా కు వేలాదిగా తరలిరావాలని పిలు పునిచ్చారు. ఈ కార్యక్రమం లో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు అవుత సైదులు, జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య, జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్, నల్లగొండ, హాలియా, చండూర్, మిర్యాలగూడ, చిట్యాల మున్సిపల్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు మున్సిపల్ కార్మికులు పెరికృష్ణ ,పేర్ల సంజీవ, కత్తుల సైదులు, నల్లగంటి లింగస్వామి, సయ్యద్ హుస్సేన్, వెంకటయ్య, జానీ బాబా , మాచర్ల సైదులు, చిక్కుళ్ళ రాములు ,రజిత, బాకీ అండాలు, కత్తుల కృష్ణవేణి ,దాసరి లక్ష్మమ్మ, మేడి శోభ, నరేష్, కిషన్ ,లింగ య్య, నరసింహ, నాగరాజు, ఎల్ల మ్మ ,శ్రీనివాస్, రమేష్, సుగుణ మ్మ ,సుజాత, తదితరులు పాల్గొన్నారు