Thummala Veera Reddy: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: కల్మేర నుండి షాపల్లి వరకు గుం తల మయమైన రోడ్డును మరమ్మ త్తులు చేపట్టి ఆగిపోయిన బస్సు లు పునరుద్ధరించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు తుమ్మల వీరారెడ్డి (Thummala Veera Reddy)డిమాండ్ చేశారు. మంగ ళవారం కట్టంగూరు మండలం పరడ గ్రామ సిపిఎం 20వ శాఖ మహాసభ అమరవీరుల స్మారక భవనంలో జరిగింది. ముఖ్యఅతి థిగా హాజరైన వీరారెడ్డి మాట్లా డుతూ కల్మేర నుండి షాపల్లి ఎక్స్ రోడ్ (Shopalli X Road) వరకు వేల గుంతలు పడి రోడ్డు అస్తవ్యస్తంగా తయారైందని అన్నారు. మరమ్మతులు చేపట్టాలని అనేకమార్లు అధికారులకు , ప్రజా ప్రతినిధులకు విన్నవించిన ఎలాంటి స్పందన లేదని అన్నారు. రోడ్డు మరమ్మతులు చేపట్టి ఆగిపోయిన నల్లగొండ నుండి నక్కలపల్లి వరకు ఆర్టీసీ బస్సులు పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు రక్షిత మంచినీటి పైపులైన్ డ్యామేజీ అవుతూ మంచినీరు కలుషిత అవుతుందని వాటిని మరమ్మత్తులు చేపట్టే పరిస్థితి లేదని అన్నారు.
గ్రామంలో పేరు కుపోయిన పారిశుద్ధ్యం అంతర్ రోడ్ల నిర్మాణం (Construction of sanitary inter roads) మంచినీటి సమస్యలపై ఆందోళన చేపట్టాలని మహాసభలో తీర్మానించడం జరిగింది. మహాసభ ప్రారంభానికి ముందు సీనియర్ సభ్యులు మానవ లింగ య్య జెండా ఆవిష్కరించారు. సిపిఎం అఖిలభారత ప్రధాన కార్యదర్శి సీతారామ్ ఏచూరి (Seetharam Yechury), సీనియర్ నాయకులు అనంత రామ శర్మ రాసముల్ల రామచంద్రం, అమరవీరులకు నివాళులర్పిం చడం జరిగింది. అనంతరం సిపిఎం శాఖ కార్య దర్శిగా కాసర్ల భిక్షం రెడ్డి, సహాయ కార్యదర్శిగా దండెం పల్లి నరసింహ లు ఏకగ్రీవంగా ఎ న్నికయ్యారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు గంజి మురళీధర్, దండెంపల్లి సత్తయ్య, మండల కార్యదర్శి పెంజర్ల సైదులు, మండల కమిటీ సభ్యులు కొండూరు సత్తయ్య శాఖ సభ్యులు చెడిపల్లి అయ్యన్న, కొండూరు లింగయ్య, కస్పరాజు పిచ్చయ్య, దూదిమెట్ల గురు వయ్య, పోతరాజు లింగయ్య తదితరులు పాల్గొన్నారు