Thummala Veera Reddy: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: తెలంగాణా సాయుధ రైతాంగ పోరాట స్పూర్తితో భూమి, భుక్తి, విముక్తికై తదితర ప్రజాసమస్యలపై ఉద్యమించాలని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు తుమ్మల వీరారెడ్డి, నారి ఐలయ్యలు పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక దొడ్డి కొమరయ్య భవన్లో చాకలి ఐలమ్మ 39వ వర్ధంతి సభ జరిగింది. ముఖ్యఅతిధిగా పాల్గొన్న తుమ్మల వీరారెడ్డి (Thummala Veera Reddy), నారి ఐల య్య లు మాట్లాడుతూ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని భాజపా హిందూ ముస్లిం పోరా టంగా వక్రీకరించడాన్ని తీవ్రంగా ఖండించారు. నాటి తెలంగాణ సాయుధ పోరాటమంతా వెట్టిచాకి దున్నేవాడికి భూమి కావాలని డిమాండ్తో సాగిందన్నారు. నాటి వీరతెలంగాణ స్పూర్తితో సమస్యలు లేని తెలంగాణ రాష్ట్ర సాధనకోసం ప్రజలందరూ ఐక్యంగా ఉద్యమించాలని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి కార్యచరణ ప్రణాళిక రూపొందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.
ఇటీవల కురిసిన వర్షాలతో పంట నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం పరామర్శించి వెంటనే నష్టపరిహారం చెల్లించాలని కోరారు. వ్యవసాయ పెట్టుబడుల సహాయం కోసం ప్రభుత్వం వెంటనే రైతు భరోసా నిధులను విడుదల చేయాలని కోరారు. రుణమాఫీలో భాగంగా 2 లక్షలు మాఫీ గాని వారికి వెంటనే మాఫీ అయ్యేవిధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు. మురికి కాలువలుగా మారిన అన్ని రకాల రోడ్లకు వెంటనే మరమ్మతులు చేయాలని అన్నారు. రోడ్లు మురికి కాలువలు మారడంతో ప్రజలకు పెద్ద ఎత్తున విష జ్వరాలు వస్తున్నాయని, అన్ని రకాల విష జ్వరాలను ఆరోగ్యశ్రీలో (Arogyashri) చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
వ్యవసాయేత్పత్తులకు అయ్యే ఖర్చులు పెరగడం, దిగుబడి రాకపోవడం, ప్రభుత్వ మద్దతు ధరలు లేకపోవడంతో తీవ్రమైన అప్పుల ఊబిలోకి కూరుకుపోయారని గుర్తు చేశారు. నిరుద్యోగులకు (unemployed) ఉపాధి అవకాశాలు కల్పించేందుకు అన్ని శాఖలలో ఖాళిగా వున్న పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని అన్నారు. నాటి జాగిర్దారు, భూస్వామ్య వ్యవస్థకు, నైజామ్ నవాబుకు వ్యతిరేకంగా జరిగిన మహత్తర సాయుధ రైతాంగ పోరాట స్పూర్తితో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు (Central and State Governments) తీసుకుంటున్న ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. కార్పోరేటు చేతిలో కీలుబోమ్మలుగా ప్రధానమంత్రి (Prime Minister) పనిచేస్తున్నారని విమర్శించారు. దేశంలో ప్రజలకు కనీస మౌళిక సౌకర్యాలను కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందారని విమర్శించారు. నిత్యావసర వస్తువులు ధరలు పెరగడంతో మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా ఉందన్నారు. ప్రవేటు కంపెనీలను, కార్పోరేట్ పెద్దలను ప్రోత్సహించడానికే ధరలను పెంచుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు బండ శ్రీశైలం, సయ్యద్ హశం, సిహెచ్ లక్ష్మినారాయణ, ఎం.డి. సలీమ్, పి. నర్సిరెడ్డి, గంజి మురళీదర్, దండెంపల్లి సత్తయ్య, తుమ్మల పద్మ, నలుపరాజు సైదులు, మన్నెం బిక్షం, కోట్ల అశోక్ రెడ్డి, బోల్లు రవీంద్ర కుమార్, ధనుంజయ్, సలివొజు సైదాచారి, బూతం అరుణకుమారి, గాదె నర్సింహ, నగేష్ తదితరులు పాల్గొన్నారు.