Tinmaar mallanna: ఎమ్మెల్సీ ఎన్నికలలో తీన్మార్ మల్లన్న గెలుపు ఖాయం
నల్లగొండ-ఖమ్మం- వరంగల్ పట్టబద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్ని కలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న మొదటి ప్రాధాన్యత ఓట్ల తోనే అత్యధిక మెజార్టీతో గెలు పొందడం ఖాయమని డిసిసి అధ్య క్షుడు కేతావత్ శంకర్ నాయక్ ధీమా వ్యక్తం చేశారు.
ఓటేసిన గ్రాడ్యుయేట్ ఓటర్లందరికి కృతజ్ఞతలు
డిసిసి అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్
ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: నల్లగొండ-ఖమ్మం- వరంగల్ పట్టబద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్ని కలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న(Tinmar Mallanna) మొదటి ప్రాధాన్యత ఓట్ల తోనే అత్యధిక మెజార్టీతో గెలు పొందడం ఖాయమని డిసిసి అధ్య క్షుడు కేతావత్ శంకర్ నాయక్ ధీమా వ్యక్తం చేశారు. బుధవారం నల్గొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komati Reddy Venkat Reddy)క్యాంపు కార్యాల యంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డితో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ(MLC) ఎన్నికల్లో గ్రాడ్యుయేట్ ఓటర్లంతా మల్లన్నకు అండగా నిలిచారని అ న్నారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్ని కలలో ఓటేసిన గ్రాడ్యుయేట్(Graduate)ఓట ర్లందరికి ఈ సందర్భంగా శంకర్ నాయక్ కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్సీగా పోటీ చేసిన తీన్మార్ మల్లన్న ఓడించడానికి బీఆర్ఎస్, బీజేపీ పార్టీల నేతలు అనేక కుట్రలు, కుతంత్రాలు పన్నారని విమర్శించారు. ఈ రెండు పార్టీలు డబ్బులు పంచి గ్రాడ్యుయేట్ ఓటర్లను ప్రలోభావాలకు గురి చేశాయని విమర్శించారు. అయి నప్పటికీ గ్రాడ్యుయేట్ ఓటర్లంతా తీన్మార్ మల్లన్నకే మద్దతుగా నిలిచారని పేర్కొన్నారు. ఓటమి భయంతో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి నోటికొచ్చినట్లుగా మాట్లాడు తున్నాడని ధ్వజమెత్తారు.ఎంపీ, ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వా త బీఆర్ఎస్ పార్టీ కనుమరుగు కావడం ఖాయమని అన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటమి భయంతో కాంగ్రెస్(Congress) డబ్బులు పంచుతూ ఓటర్లను ప్రలోభావాలకు గురిచేసిందని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి వ్యాఖ్యానించడం పట్ల శంకర్ నాయక్ తీవ్ర స్థాయిలో మండి పడ్డారు. ఈ రాష్ట్రంలో ప్రజాస్వా మ్యం లేదు, పోలీసు రాజ్యం నడుస్తుందని ఆరోపించడాన్ని తీవ్రంగా ఖండించారు. గత 10 సంవత్సరాలుగా అధికారంలో ఉండి పోలీసు రాజ్యం నడిపింది మీరు కాదా అని ప్రశ్నించారు. అధి కారం కోల్పోయిన తర్వాత జగదీష్ రెడ్డి మతిస్థిమితం కోల్పోయి మాట్ల డుతున్నాడని విమర్శిం చారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలన్నీ విస్మరించిందని, ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయకుండా మోసం చేసిందని ద్వజమెత్తారు.
అధికారం లో ఉన్నప్పుడు ప్రజల సంక్షేమాన్ని, నిరుద్యోగుల ,ఉద్యోగుల సమస్య లను పరిష్కరించకుండా అధికారం కోల్పోయిన తర్వాత కాంగ్రెస్ ప్రభు త్వాన్ని విమర్శించడమే ధ్యేయంగా పెట్టుకున్నారని ఆరోపించారు. ప్రజా విశ్వాసం కోల్పోయిన బీఆర్ఎస్(BRS)పార్టీ త్వరలో కనుమరుగ వుతుం దని, జగదీష్ రెడ్డి వేరే పార్టీని వెతుక్కోవడం ఖాయమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీ లన్నింటినీ నెరవేరుస్తూ ప్రజా పాలన సాగిస్తూ ముందుకు పోతుం దని అన్నారు. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమాన్ని జీర్ణించుకోలేక బీఆర్ ఎస్ పార్టీ నేతలు రేవంత్ రెడ్డి(Revanth Reddy) ప్రభు త్వాన్ని విమర్శించడమే ధ్యేయంగా పెట్టుకున్నారని అన్నారు. ఎంపీ, ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించడం ఖాయమని పేర్కొన్నారు. ఈ విలే కరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా నాయకులు పోలే జయకుమార్, కె.వి.ఆర్ యువసేన జిల్లా అధ్యక్షుడు మామిడి కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.
Tinmaar mallanna wins in mlc by elections