Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Tinmar mallanna: ముందంజలో కొనసాగుతున్న మల్లన్న

నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యు యేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి తీన్మార్ మల్లన్న గెలుపు దిశ వైపు పయనిస్తున్నారు.

పట్టభద్రుల శాసనమండలి ఎన్ని కల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఆధిక్యత
కొనసాగుతోన్న ఎలిమినేషన్ ప్రక్రియ

ప్రజా దీవెన, నల్లగొండ బ్యూరో: నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యు యేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక లో(Graduate MLC by-election)కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి తీన్మార్ మల్లన్న(Tinmar Mallanna)గెలుపు దిశ వైపు పయనిస్తున్నారు. బుధవారం మొదలైన మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రక్రియ గురువారం రాత్రి 8 గంటల తర్వాత పూర్తయింది. మొత్తం 3,36,013 ఓట్లు పోల్ కాగా తీన్మార్ మల్లన్నకు 122,813 ఓట్లు రాగా బీఆర్ఎ స్ అభ్యర్ధి ఏనుగులు రాకే శ్ రెడ్డికి 1,04,348 ఓట్లు వ చ్చాయి. అంటే మల్లన్న 16, 365 ఓట్ల మెజార్టీ సాధించారు. అయితే పోలైన ఓట్ల లో 50 శాతం పైగా ఓ ట్లు ఎవరికి వస్తే, వాళ్లనే విజేతగా ప్రకటిస్తారు. మొదటి ప్రాధాన్యత ఓట్లలో 25,8 77 చెల్లకుండా పోయాయి దీంతో చెల్లుబాటు అయిన 3,10,136 ఓట్ల లో ఎవరి కైతే 1,55,095 ఓట్లు వస్తాయో, వాళ్లను విజేతగా ప్రకటించను న్నారు.కానీ ఎవరికీ మెజార్టీ రాక పోవడంతో రాత్రి 9 గంటల నుంచి రెండో ప్రయారిటీ ఓట్ల లెక్కింపు మొదలుపెట్టారు. మల్లన్నకు పోలైన ఓట్లను పరిశీ లిస్తే, గెలుపు అవకా శాలు ఆయనకే ఎక్కువగా ఉన్నా యి. రెండో ప్రయారిటీ ఓట్లలో మల్లన్నకు 32,262 వస్తే ఆయనే విజేతగా నిలుస్తారు. అదే రాకేశ్ రెడ్డి(Rakesh Reddy) గెలుపొందాలంటే ఆయనకు 50,847 ఓట్లు రావాల్సి ఉంటుంది. రెండో పాధాస్యత ఓట్లలో నాలుగు రౌండ్ల లో కూడా మల్లన్నకే మెజార్టీ వచ్చింది. చివరి రౌండ్లో ఓట్లు తక్కు వగా ఉన్నందున మెజార్టీ తగ్గినట్టు కనిపించింది.

ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభం… ఎలిమినేషన్ ప్రక్రియలో తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్ధి నుంచి కౌంటింగ్ ప్రారం భిస్తారు. మొత్తం 52 మoది అభ్య ర్థులో మలన్న, రాకేశ్ రెడ్డి, ప్రేమేం దర్ రెడ్డి, అశోక్ కుమార్ ను మిన హాయిస్తే మిగతా 48 మంది అభ్యర్ధులకు కలిపి 10,065 ఓట్లు పోలయ్యాయి. ఆ 44 నుండి ఓట్ల ను బదిలీ చేయడానికి ఎక్కువ సమయం పట్టదని అధికారులు చెబుతున్నారు. అయితే అభ్యర్ధి గెలుపుకు ఆ ఓట్లు కూడా సరిపో నందున అశోక కుమార్ కు వచ్చిన 29,697 ఓట్లు, ప్రేమేందర్ రెడ్డికి వచ్చిన 43.313 ఓట్లను కూడా లెక్కించాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా ప్రస్తుత ఎన్నికల్లో కూడా అదే సీన్ రిపీట్ అవుతున్నది. తొలి ప్రాధాన్యత ఓట్లలో మల్లన్నకు 1.22 లక్షల ఓట్లు వచ్చినందున. రెండో ప్రాధాన్యత ఓట్లలో మల్లన్నను చేరు కోవడం రాజేశ్ రెడ్డికి అంత సులు వు కాదు కాబట్టి గెలుపు మల్లన్నదే అవుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో 48 మంది అభ్యర్థులు ఎలిమినేషన్(Elimination)కానున్నారు. ఆ తర్వాతా స్వతంత్ర అభ్యర్థి పాలకూరి అశోక్ గౌడ్ సాధించిన 29,697 ఓట్లలో రెండో ప్రాధాన్యత ఓటును, బీజేపీ అభ్యర్థి ఎలిమినేషన్ తోనే విజేతకు రావా ల్సిన 1,55,095 ఓట్లు కు కలుస్తా యి. కాగా 48 మంది అభ్యర్థుల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులకు పోటాపోటీగా ఓటు షేర్ అవుతుo డడంతో ఎమ్మెల్సీ ఫలితం పై ఉత్కంఠతో రేకెత్తిస్తుంది. ఇదిలా ఉంటే గెలుపు పోవడానికి కాంగ్రెస్ అభ్యర్థి మల్లన్న దగ్గర ఉండగా సాయంత్రం వరకు తుది ఫలితం వెలువడనుంది.

కౌంటింగ్ లో అవతవకలు..

బిఆర్ఎస్ అభ్యర్థి రాజేశ్ రెడ్డి(Rajesh Reddy) మాట్లాడుతూ కౌంటింగ్ లు జరుగు తున్నాయని అభ్యంతరం వ్యక్తం చేస్తున్న ఆర్వో బుట్టదాఖలు చేస్తూ అడిగినదివ్వడం లేదు. నాలుగో రౌండ్ లో మెజార్టీ ఉన్నప్పటికీ, అం తా గోల్ మాల్ చేశారు. మూడో రౌండ్ ఫలితాలపై అనేక అనుమా నాలు ఉన్నాయి. మళ్లీ కౌంటింగ్ చేయాలని కోరుతున్నాం. మా గెలు పును ఎవరూ ఆపలేరని వ్యాఖ్యానించారు.
ఓటమి భయంతోనే బీఆర్ఎస్ ఆరోపణలు.. అధికారులపై ఆరోప ణలు వాస్తవమని కాంగ్రెస్(Congress) పార్టీ బలపరిచిన అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఖండించారు.గ్రాడ్యుయేట్ ఎమ్మెల్నీ ఉపఎన్నికలో ఓటమి త ప్పడని తెలిసే అధికారులపై వీఆర్ ఎస్ నేతలు నిందలు వేస్తున్నాడని కాంగ్రెస్ అభ్యర్ధి తీన్మార్ మల్లన్న మండిపడ్డారు. ఆ పార్టీ నేతలు కౌం టింగ్ హాల్ నుంచి ఉత్త చేతులతో పోవడం ఎందుకని, అధికారుల మీద మన్ను పోసి పోయే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. గురు వారం కౌంటింగ్ కేంద్రం వద్ద తీన్మార్ మల్లన్న మీడియాతో మాట్లాడారు. ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్, కౌంటింగ్ అధికారులపై టీఆర్ఎస్ అభ్యర్థి రాకేశిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి తో కలిసి చేసిన ఆరోపణలో వాస్తవం లేదన్నారు.గతంలో మాదిరిగా బోగస్ ఓట్లతో లబ్ది పొందాలని చేసిన కుతంత్రం కూడా పారలేదని, అందుకేనా పై అనేక రకాలుగా బుర దజల్లారని పేర్కొన్నారు. బీఆర్ ఎస్(BRS) నేతల మాటలు చూస్తుంటే, ముందే ఓటమిని ఒప్పుకున్నట్టుగా ఉన్నా యన్నారు.బీఆర్ఎస్ వాళ్లు కౌంటిం గ్ కేంద్రాన్ని విడిచి వెళ్లవద్దు దయ చేసి తుది ఫలితం వచ్చే వరకు ఉండి వెళ్లాలని కోరారు.

 

ఉప ఎన్నికల్లో ఉపయోగపడని పట్టభద్రులు @ 25,877

అధికారులు, విశ్లేషకుల విస్మయం

ప్రజా దీవెన, నల్లగొండ బ్యూరో: చదువుకోవాలి చదువుకుంటే భవిష్యత్తు కు భరోసా అంటూ పెద్ద పెద్ద మాటలు చెప్పి చదివిస్తే చదు వుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వే యడంలో విఫలమయ్యారు. ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రం కు వచ్చి న వీరందరూ డిగ్రీ, పీజీ, ఇంజనీరిం గ్ చదువుకున్న 25,877 మంది పట్టభద్రుల ఓట్లు ఉప ఎన్నికలో ఉపయోగం లేకుండా పోయాయి. ఎన్నికల అధికారులు అనేక రకా లుగా అవగాహన కల్పించినా, సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం చేసినా పట్టభద్రు లు సరిగా ఓటువేయలేకపోయా రు. ఈ క్రమంలోనే ఇటీవల జరిగిన నల్లగొండ, వరంగల్, ఖమ్మం గ్రాడ్యు యేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో అన్ని ఇన్ని కాకుండా ఏకంగా 25,877 ఓట్లు చెల్లకుండా పోయాయoటే ఇంతమంది పట్టభద్రుల ఉద్దేశం ఏంటో అర్థం కావట్లేదు. ఉప ఎన్నికల్లో మొత్తం 52 మంది అభ్యర్థులు బరిలో నిలువగా ప్రధాన అభ్యర్థులతో సమానంగా చెల్లని ఓట్లే సైతం ఆరో స్థానాన్ని ఆక్రమించాయి. దీంతో ఫలితంగా రాజకీయ పార్టీలు బలపరిచిన ప్రధాన అభ్యర్థులకు మొదటి ప్రాధా న్యత ఓటు ద్వారా గెలుపును దూరం చేసినట్లే అని పరిశీలకు భావిస్తున్నారు.
బ్యాట్ పేపర్ పై పిచ్చిరాతలు
బ్యాలట్ పేపర్ల మీద గ్రాడ్యుయేట్లు(Graduates)ఇష్టం వచ్చినట్లు పిచ్చి రాతలు రాశారు. 1,2,3 లా ప్రాధాన్యత క్రమంలో అంకెలను వేయాల్సి ఉండగా, 1 లేకుండా 2, 3, 4 వేస్తూ పోయారు కొందరైతే అంకెల స్థా నంలో క్రాస్ గుర్తులు, టిక్ మార్కు లు పెట్టారు. పేపర్ మీద జై ‘మల్లన్న’, ‘జై రాకేశ్ రెడ్డి’ అని రాశారు. ఇంకొందరు బ్యాలెట్ పేపర్ వెనకాల ఫోన్ నంబర్లు వేయడంతో పాటు ‘ఐలవ్ యు’ అని రాశారు.

Tinmar mallanna lead in MLC by Election