Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

TRSV: కేటీఆర్ పై కాంగ్రెస్ గుండాల దాడి ఆమానుషo

TRSV: ప్రజా దీవెన,నల్లగొండ టౌన్: నల్గొండ జిల్లా కేంద్రంలోని వీటి కాలనీలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో (BRS Party District Office)ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టిఆర్ఎస్వి (TRSV) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నిరంతరం శ్రమించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కావడంలో కీలక పాత్ర వహించినటువంటి మరియు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందు తీసుకెళ్తూ గతంలో ఐటీ మున్సిపల్ శాఖ మంత్రిగా దేశానికి వన్నె తెచ్చే విధంగా పనిచేసిన తెలంగాణ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) గారి పై ఈరోజు ఏదైతే మూసి పారివాక ప్రాంతమైనటువంటి ప్రజలను పరామర్శించడానికి పోయిన కేటీఆర్ గారిపై కాంగ్రెస్ గుండాలు తన కార్ పై బిఆరెస్ పార్టీ నాయకులపై దాడి చేయడాన్ని తీవ్రంగా కండించారు.

అదే విదంగా తక్షణమే డీజీపీ (DGP) గారు స్పందించి దాడి చేసిన వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు అదేవిధంగా కేటీఆర్ గారికి జెడ్ ప్లస్ కేటగిరి కల్పించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇలాంటి చర్యలు మరల పునరావృతం కాకుండా సీఎం రేవంత్ రెడ్డి గారు శాంతి భద్రతలను అదుపులో పెట్టాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు అదేవిధంగా ఈ దాడులో ప్రేక్షక పాత్ర పోషించిన పోలీసు అధికారులపై సస్పెన్షన్ (Suspension) వేటు వేయాలని డీజీపీ గారిని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు తిరుమల సైదులు, చామకూరి లింగస్వామి గౌడ్, సురేష్, నగేష్,రమేష్, నరేష్, శంకర్,వెంకన్న, రాజు, తదితరులు పాల్గొన్నారు