— నల్లగొండ ఇన్చార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
Tummala Nageswara Rao: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: తొలకరి ముందు ఎంతో సంతోషం తో ఘనంగా గిరిజనులు తేజ్ పండుగ నిర్వహించుకోవడం సంస్కృతి సంప్రదాయాలకు నిదర్శనమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao)అన్నారు. శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ సెంటర్లో గిరిజన సంఘా ల ఆధ్వర్యంలో నిర్వహిం చిన తేజ్ పండుగకు ఆయన ముఖ్య అతిథి గా హాజర య్యారు. తీజ్ పండుగ (Tej festival)అంటే రైతుల పండుగని, అందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆశి స్తూ చేసుకునే పండుగ తేజ్ అని అన్నారు. తేజ్ పండుగ (Tej festival) సందర్భంగా ఆయన రైతులకు, ప్రత్యేకించి లం బాడా గిరిజనులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
రాష్ట్ర శాసనమం డలి చైర్మన్ గుత్తా సుఖేం దర్ రెడ్డి (Gutta Sukhender Reddy) ,రాష్ట్ర రోడ్లు, భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komati Reddy Venkata Reddy) తేజ్ పండుగ శుభాకాంక్షలు తెలియ జేశారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి మాట్లాడుతూ ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పటి నుండి లంబాడ గిరిజనులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిందని, అదే రీతిలో తమ ప్రజా ప్రభుత్వం సైతం గిరిజనులకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, గిరిజన ప్రాంతాలలో వ్యవసాయం చేసుకునే రైతులకు సైతం తాము ఇటీవల రుణమాఫీని అమలు చేయడం జరిగిందని అన్నారు. గిరిజనులకు ఇందిరమ్మ ఇండ్లను ఇస్తామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.పార్లమెంట్ సభ్యులు రఘువీర్ ,జిల్లా కలెక్టర్ సి. నారా యణ రెడ్డి, మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, నకిరేకల్ శాసనసభ్యులు నోముల వీరేశం తేజ్ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి తదితరు లు పాల్గొన్నారు.