Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Telangana Union of Working Journalist: తెలంగాణ అమరుల త్యాగం అజరామరం

తెలంగాణ రాష్ట్ర ఆవి ర్భావ(Telangana formation day celebrations)దినోత్సవాన్ని పురస్కరిం చుకొని నల్లగొండ తెలంగాణ యూ నియన్ ఆఫ్ వర్కింగ్ జర్న లిస్ట్- 143(Telangana Union of Working Journal List) ఆధ్వర్యంలో జర్నలిస్టులు అమరవీరులకు( Telangana martyrs) ఘన నివాళి అర్పించారు.

తెలంగాణ అమరుల త్యాగం అజరామరం
నల్లగొండ టీయూడబ్ల్యూజే-143 ఆధ్వర్యంలో అమరులకు ఘన నివాళి

నల్లగొండ: తెలంగాణ రాష్ట్ర ఆవి ర్భావ(Telangana formation day celebrations)దినోత్సవాన్ని పురస్కరిం చుకొని నల్లగొండ తెలంగాణ యూ నియన్ ఆఫ్ వర్కింగ్ జర్న లిస్ట్- 143(Telangana Union of Working Journalist) ఆధ్వర్యంలో జర్నలిస్టులు అమరవీరులకు( Telangana martyrs) ఘన నివాళి అర్పించారు. ఆదివారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని పెద్ద గడియారం కూడలిలో గల అమరవీరుల స్తూపం వద్ద కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు.ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే -143 నల్లగొండ జిల్లా అధ్యక్షులు గుండగోని జయ శంకర్ గౌడ్ మాట్లాడుతూ తెలం గాణ రాష్ట్ర సాధనకు తొలి, మలి దశ ఉద్యమాల్లో అసువులుబాసిన ఎంతో మంది అమరవీరుల త్యాగం అజరామరమని పేర్కొన్నారు.

అమ రుల త్యాగాల ఫలితంగానే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని గుర్తు చేశారు. అమరల ఆశయాలు సాధించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు పూర్తి చేసుకొని 11వ సంవత్సరంలోకి అడుగిడు తున్న శుభసందర్భంలో ప్రజలం దరికీ యూనియాన్ జిల్లా కమిటీ తరపున శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో తొలి, మలిదశలో అసువులు బాసిన అమరవీరులకు జోహార్లు అర్పిం చారు. వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపు నిచ్చారు.

తెలంగాణ రాష్ట్ర సాధన లో టిజెఎఫ్ (TJF)ఆద్వర్యంలో జర్నలి స్టులు ప్రధాన భూమిక పోషిం చారని గుర్తు చేశారు.ఈ కార్యక్ర మంలో రాష్ర్ట నాయకులు మామిడి దుర్గాప్రసాద్, దీకొండ రవిశంకర్, పిల్లలమర్రి శ్రీనివాస్,గాదె రమేష్, నకరికంటి శ్రీనివాస్, దండంపల్లి రవికుమార్, ముచ్చర్ల విజయ్, పోగుల రమేశ్, నీలకంఠ మధు, రాంప్రసాద్, కత్తుల హరి, ముచ్చర్ల శ్రీనివాస్,కత్తుల యశ్వంత్, కే శివ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

TUWJ Tribute to Telangana martyrs